Begin typing your search above and press return to search.

9 నెలల తర్వాత ఓటీటీ లో హిట్‌ మూవీ...!

థియేట్రికల్‌ రిలీజ్ తర్వాత ఈ మధ్య కాలంలో మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ ల్లో పెద్ద హీరోల సినిమాలు కూడా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Feb 2024 5:39 AM GMT
9 నెలల తర్వాత ఓటీటీ లో హిట్‌ మూవీ...!
X

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వని ది కేరళ స్టోరీ ఎట్టకేలకు జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

థియేట్రికల్‌ రిలీజ్ తర్వాత ఈ మధ్య కాలంలో మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ ల్లో పెద్ద హీరోల సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ కేరళ స్టోరీ మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వక పోవడం వెనుక కారణం ఏంటో అనే చర్చ ఇన్నాళ్లు జరిగింది. ఆ విషయం పక్కన పెడితే జీ5 లో వచ్చే వారంలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉందని కొందరు ఆ మధ్య ఆందోళన చేసిన విషయం తెల్సిందే. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా వివాదాల కారణంగా జాతీయ స్థాయిలో పబ్లిసిటీ దక్కించుకుని దేశ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసి రికార్డ్‌ సృష్టించింది.

అదా శర్మ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో హిందువుల అమ్మాయిలను ముస్లింలు గా మార్చి ఎలా ఉగ్రవాదులుగా మార్చుతున్నారు అనేది సినిమా కథాంశం. థియేటర్‌ లో విడుదల అయిన సమయంలో చూడని వారు చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్‌ అయినప్పుడు చూడాలి అనుకున్నారు.

ఎట్టకేలకు ఫిబ్రవరి 16న ఈ సినిమా ఓటీటీ ద్వారా రాబోతున్న నేపథ్యంలో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో జరిగిన వివాదం కచ్చితంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఓటీటీ లో కూడా అత్యధికులు చూసే అవకాశాలు ఉన్నాయి.