స్కై ఈజ్ లిమిట్.. దూసుకెళుతున్న యంగ్ బ్యూటీ!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక యంగ్ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. తక్కువ కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటూ స్కైలోకి దూసుకెళుతున్న ఈ నటి ఎవరో కాదు.. యంగ్ బ్యూటీ కయాదు లోహర్.
By: Sivaji Kontham | 1 July 2026 8:00 AM ISTసౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక యంగ్ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. తక్కువ కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటూ స్కైలోకి దూసుకెళుతున్న ఈ నటి ఎవరో కాదు.. యంగ్ బ్యూటీ కయాదు లోహర్. ఇప్పటికిప్పుడు ఈ భామ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. మాలీవుడ్ స్టార్ టొవినో థామస్ సరసన `పల్లి చట్టంబి`, విశ్వక్ సేన్ `ఫంకీ` వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, కోలీవుడ్లో జీవీ ప్రకాష్ సరసన ఓ భారీ చిత్రం `ఇమ్మోర్టల్`లో నటిస్తోంది. అలాగే అధర్వ మురళి, ఫహాద్ ఫాజిల్ల కాంబినేషన్లో వస్తున్న `ఇదయం మురళి` చిత్రం ఈ నెలలోనే గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. వీటన్నింటితో పాటు నేచురల్ స్టార్ నాని సరసన `ది ప్యారడైజ్` చిత్రంలో సుబ్బు పాత్రలో నటిస్తూ టాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది.
ఇలాంటి క్రేజీ లైనప్లో ఉన్న ఈ ముద్దుగుమ్మకు కెరీర్లోనే బిగ్గెస్ట్ జాక్పాట్ ఆఫర్ లభించింది. స్టార్ హీరో సూర్య సరసన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ `హోంబలే ఫిలిమ్స్` నిర్మిస్తున్న పాన్-ఇండియా సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా ఎంపికైంది. ఈ భారీ ఆఫర్ల నేపథ్యంలో కయాదు లోహర్ ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటోంది? ఇప్పుడు పెద్ద బ్యానర్ల సినిమాల కోసం రెమ్యునరేషన్ పెంచిందా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పరిశ్రమ సమాచారం ప్రకారం.. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటివరకు మీడియం బడ్జెట్- రీజినల్ (మలయాళం, కన్నడ) సినిమాలకు రూ.40 లక్షల నుండి రూ.60 లక్షల వరకు పారితోషికం అందుకుంది. కెరీర్ ప్రారంభంలో ఉన్న హీరోయిన్లకు ఇది ప్రామాణిక పారితోషికం.
అయితే నాని సరసన `ది ప్యారడైజ్`, సూర్య సరసన హోంబలే ఫిలిమ్స్ వంటి పాన్-ఇండియా రేంజ్ ప్రాజెక్టులు చేతికి రావడంతో కయాదు డిమాండ్ మార్కెట్లో ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రేజ్.. స్టార్ హీరోల సరసన అవకాశాల నేపథ్యంలో కయాదు తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందని గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద బ్యానర్లు , మల్టీ-లాంగ్వేజ్ సినిమాల కోసం ఏకంగా రూ.80 లక్షల నుండి రూ.1.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చేతిలో అరడజను సినిమాలు ఉండటం... మార్కెట్ వాల్యూ పెరగడంతో మునుముందు ఈ యంగ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ల సరసన `కోటి క్లబ్`లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
వెండితెరపైనే కాకుండా డిజిటల్ వేదికలపైనా కయాదు లోహర్ హవా నడుస్తోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 31 లక్షల మంది (3.1 మిలియన్లు) ఫాలోవర్స్ ఉన్నారు. ఈ భారీ ఫాలోయింగ్ - రీచ్ను బట్టి సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం బ్రాండ్ల నుండి ఈ బ్యూటీ గట్టిగానే వసూలు చేస్తోందిట. ఇన్స్టాలో ఒక్కో పోస్ట్ లేదా రీల్ ప్రమోషన్ కోసం బ్రాండ్ విలువ, కాంట్రాక్ట్ను బట్టి 2 లక్షల నుండి 4 లక్షల వరకు అందుకుంటోందని సమాచారం. కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉండే ఇన్స్టా స్టోరీ ప్రమోషన్ కోసం రూ.75,000 నుండి రూ.1.5 లక్షల వరకు చార్జ్ చేస్తూ డిజిటల్ మార్కెట్లో తన బ్రాండ్ పవర్ను నిరూపించుకుంటోంది.
దీనికి అదనంగా ఎక్స్ - ట్విట్టర్ ప్లాట్ఫార్మ్పై సినిమా ప్రమోషన్లు లేదా బ్రాండ్ హాష్ట్యాగ్ ట్రెండింగ్ కోసం చేసే ఒక్కో ప్రమోషనల్ ట్వీట్ లేదా రీట్వీట్ కోసం కయాదు రూ.50,000 నుండి 1 లక్ష వరకు పారితోషికం అందుకునే ఛాన్సుందని విశ్లేషిస్తున్నారు. అలాగే పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం `ప్యాకేజీ డీల్స్` కూడా ఆస్కారం ఉంది. ఒకేసారి ఒక రీల్, రెండు స్టోరీలు, ఒక ఎక్స్ పోస్ట్ కలిపి ఇచ్చే కంబైన్డ్ ప్యాకేజీల కోసం కయాదు 4 లక్షల నుండి 6 లక్షల వరకు డిమాండ్ చేసే వీలుందని సోషల్ మీడియా అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ఆదాయంపైనా దృష్టి సారిస్తోందని సమాచారం.
