Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్‌' పై బాలీవుడ్ కింగ్ పిన్ స్పంద‌న‌

కరణ్ జోహార్ యానిమల్ డిబేట్ గురించి మాట్లాడాడు. ఈ చిత్రం తనను ఆకట్టుకుందని, ఆకట్టుకునేలా చేసిందని మ‌రో ఆలోచ‌న లేకుండా తనని ఉత్తేజపరిచిందని అంగీకరించ‌డం నిజానికి అభిమానులను షాక్‌కు గురిచేసింది.

By:  Tupaki Desk   |   13 March 2024 4:33 AM GMT
యానిమ‌ల్‌ పై బాలీవుడ్ కింగ్ పిన్ స్పంద‌న‌
X

బాలీవుడ్ కింగ్ పిన్ క‌ర‌ణ్ జోహార్ ఏం మాట్లాడినా అది ట్రెండింగ్ గా మారుతోంది. కరణ్ జోహార్ ఇటీవ‌ల‌ ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్స్ 2024కి హాజరయ్యారు. గత రెండేళ్లుగా అత‌డు చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు యానిమ‌ల్ గురించి మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడారు. గత సంవత్సరం రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో కంటెంట్ వివాదానికి కూడా దారితీసింది. చాలా మంది ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. కొంద‌రు ప్రముఖులు సహా చాలా మంది వ్యక్తులు యానిమల్‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్స్ 2024లో కరణ్ జోహార్ యానిమ‌ల్‌పై చర్చకు దిగారు.

కరణ్ జోహార్ యానిమల్ డిబేట్ గురించి మాట్లాడాడు. ఈ చిత్రం తనను ఆకట్టుకుందని, ఆకట్టుకునేలా చేసిందని మ‌రో ఆలోచ‌న లేకుండా తనని ఉత్తేజపరిచిందని అంగీకరించ‌డం నిజానికి అభిమానులను షాక్‌కు గురిచేసింది. అతడు 'యానిమ‌ల్' గురించి విమ‌ర్శిస్తున్న‌ వ్యక్తుల గురించి విన్నాన‌ని, దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా సినిమా గురించి చాలా విషయాలు చెప్పాడని కరణ్ జోహార్ పేర్కొన్నాడు. యానిమ‌ల్‌పై తన అభిప్రాయాలను షేర్ చేస్తూ.. ఈ చిత్రాన్ని క్యారెక్టర్ ఆధారంగా క్యారెక్టర్ ఫిల్మ్‌గా చూశానని చెప్పాడు. RK పాత్రను స్వాభావికంగా హింసాత్మకంగా భావోద్వేగ సమస్యలు ఉన్న పాత్ర‌గా పేర్కొన్నాడు. సినిమా ఆద్యంతం సందీప్ రెడ్డి ట్రీట్మెంటును ఇష్టపడ్డాన‌ని అన్నారు.

ఇతరుల్లా తాను డీప్ డైవ్ చేసి సినిమాను విడదీసి చూడ‌లేదని క‌ర‌ణ్ ఒప్పుకున్నాడు. తాను కథనంలో లీన‌మైపోయాను గ‌నుక‌ నైతిక సంభాషణ గురించి మాట్లాడలేను. బిజిఎమ్, సౌండ్, స్క్రీన్‌ప్లే, డైలాగ్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఇలా సందీప్ సినిమాను ఎలా నేరేట్ చేశారో అర్థం చేసుకున్నాన‌ని, ఒక ఫిల్మ్ మేకర్‌గా నాకు నచ్చింది అని కొనియాడారు. యానిమ‌ల్ పై నా అభిప్రాయంతో కొంద‌రు ఏకీభవించారని కొంద‌రు విభేదించారని కరణ్ తెలిపారు.

'యానిమల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లు రాబట్టింది. రణబీర్, ట్రిప్తి డిమ్రీ, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఒబెరాయ్ త‌దిత‌రులు నటించారు. అల్లు అర్జున్, అలియా భట్, త్రిష, అద్నాన్ సామి, సన్నీ డియోల్ తదితరులు యానిమ‌ల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.