Begin typing your search above and press return to search.

తండ్రితో క‌లిసి 4 ఫ్లాట్లు అమ్మేసిన‌ క‌పూర్ సిస్ట‌ర్స్

బోనీ కపూర్, అత‌డి కుమార్తెలు జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ ఇటీవల ముంబైలోని ప్రతిష్టాత్మక అంధేరీ శివారులోని తమ నాలుగు అపార్ట్‌మెంట్లను విక్రయించాలని ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:52 AM GMT
తండ్రితో క‌లిసి 4 ఫ్లాట్లు అమ్మేసిన‌ క‌పూర్ సిస్ట‌ర్స్
X

ఫ్లాట్లు కొన‌డం, అమ్మ‌డం మంచి వ్యాపారం. స‌ర‌స‌మైన‌ ధ‌ర వ‌చ్చిన‌ప్పుడు తెలివిగా వాటిని సేల్ చేయ‌డం, మ‌రోచోట పెట్టుబడి పెట్ట‌డం ఇది తెలివైన పని. ఇలాంటి వ్యాపారంలో బాలీవుడ్ స్టార్లు అంద‌రి కంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. ముఖ్యంగా బోనీకపూర్ అత‌డి కుమార్తెలు జాన్వీ-ఖుషీ ఈ త‌ర‌హా రియ‌ల్ వ్యాపారంలో భారీ పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే గాక‌, లాభాల‌కు అమ్మ‌డంలోను పాపుల‌ర‌య్యారు.

బోనీ కపూర్, అత‌డి కుమార్తెలు జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ ఇటీవల ముంబైలోని ప్రతిష్టాత్మక అంధేరీ శివారులోని తమ నాలుగు అపార్ట్‌మెంట్లను విక్రయించాలని ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫ్లాట్‌లు హై-ఎండ్ లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్నాయి. ఈ పరిస‌రాల్ని నగరంలోని అత్యంత ఉన్నతమైన ప్రాంతాలలో ఒకటిగా పిలుస్తారు. ముంబై మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. ముగ్గురూ ఒకే హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు ఫ్లాట్‌లను 12 కోట్ల రూపాయలకు విక్రయించారు.

2 నవంబర్ 2023న బోనీ కపూర్ .. అతడి కుమార్తెలు మొత్తం రూ. 6.02 కోట్లకు రెండు అంధేరీ ఫ్లాట్‌ల అమ్మ‌కాన్ని ఖరారు చేశారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్‌లు సమిష్టిగా 1870 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ఒప్పందంలో బహిరంగ పార్కింగ్ స్థలం కూడా ఉంది. సిద్ధార్థ్ నారాయణ్- అంజు నారాయణ్ ఈ ఆస్తుల కొనుగోలుదారులుగా అధికారిక పత్రాలు నిర్ధారించాయి.

గతంలో అంటే 12 అక్టోబర్ 2023న బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఒకే కాంప్లెక్స్‌లోని మిగిలిన రెండు అపార్ట్‌మెంట్‌లను మొత్తం రూ. 6 కోట్లకు అధికారికంగా విక్రయించారు. 1614 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్‌లలో రెండు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్ల కొనుగోలుదారులు ముస్కాన్ బహిర్వానీ - లలిత్ బహిర్వానీ. 2022లో బోనీ, జాన్వీ , ఖుషి బాంద్రాలో 65 కోట్ల రూపాయలతో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడం గమనించదగ్గ విషయం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఖుషీ కపూర్ చివరిసారిగా 'ది ఆర్చీస్‌'లో కనిపించింది. త‌దుప‌రి కరణ్ జోహార్ నిర్మించే ప్రాజెక్ట్‌లో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి కనిపిస్తుంది. మరోవైపు జాన్వీ కపూర్ చివరిగా 'బవాల్‌'లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది. త‌దుప‌రి టాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం దేవ‌ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.