Begin typing your search above and press return to search.

బాధ్య‌త‌తో ముందుడ‌గేసిన క‌మ‌ల్

ప్ర‌స్తుతం దేశంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఇది సెల‌బ్రేష‌న్స్ టైమ్ కాద‌ని, మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మేక‌ర్స్ పోస్ట్ పోన్ చేశారు.

By:  Tupaki Desk   |   9 May 2025 5:40 PM IST
బాధ్య‌త‌తో ముందుడ‌గేసిన క‌మ‌ల్
X

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా సినిమా థ‌గ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. మే 16న ఈ సినిమా ఆడియో లాంచ్ ను చేయాల‌ని ఆల్రెడీ ప్లాన్ చేయ‌గా, తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో చిత్ర యూనిట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌స్తుతం దేశంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఇది సెల‌బ్రేష‌న్స్ టైమ్ కాద‌ని, మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మేక‌ర్స్ పోస్ట్ పోన్ చేశారు. ఈ విష‌యాన్ని క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. మాతృభూమి ప‌రిర‌క్ష‌ణ‌లో పోరాటం చేస్తున్న ఈ టైమ్ లో మ‌నం సెల‌బ్రేట్ చేసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని వెల్ల‌డించారు.

మేం దేశ పౌరులుగా బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాం, సైనికుల‌కు మా మద్ద‌తు తెలియ‌చేస్తున్నాం, అందుకే మే 16న జ‌ర‌గాల్సిన ఆడియో రిలీజ్ ను వాయిదా వేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే కొత్త డేట్ ను అనౌన్స్ చేస్తామ‌ని క‌మ‌ల్ తెలిపారు. 1987లో నాయ‌క‌న్ సినిమాతో క‌మ‌ల్- మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ లో సినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరి కాంబినేష‌న్ లో థ‌గ్ లైఫ్ వ‌స్తోంది.

గ్యాంగ్ స్ట‌ర్, యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న థ‌గ్ లైఫ్ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, శింబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.