భారీ లాభాల్లో కమల్ - మణిరత్నం 'థగ్ లైఫ్'!
ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రూ.149.7 కోట్లకు దక్కించుకుందని తెలిసింది. ఇటీవలే ఈ డీల్ని మేకర్స్ పూర్తి చేశారని ఇన్ సైడ్ టాక్.
By: Tupaki Desk | 14 May 2025 1:30 AMఇండియన్ సినీ చరిత్రలో కమల్ హాసన్, మణిరత్నంలకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కలయికలో రూపొందిన సంచలన చిత్రం 'నాయకుడు'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి వీరిద్దరి కెరీర్లో మరపురాని సినిమాగా నిలిచింది. 1987లో 'నాయకన్' పేరుతో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనం సృష్టించింది. హేమా హేమీలు పని చేసిన ఈ సినిమాతో కమల్ నటుడిగా సరికొత్త చరిత్రను సృష్టించారు. అప్పట్లో కోటి వసూలు చేసిన ఈ సినిమా తరువాత మరోసారి కమల్ - మణిరత్నం కలిసి పని చేయలేదు.
సుధీర్ఘ విరామం తరువాత మళ్లీ వీరిద్దరు లెజెండ్లు కలిసి చేస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో శింబు, త్రిష, అభిరామి, బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, ఐశ్వర్య లక్ష్మీ, పంకజ్ త్రిపాఠీ, మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. జూన్ 5న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇటీవల ప్లాన్ చేశారు. అయితే భారత్ -పాక్ యుద్ధం మొదలు కావడంతో ఆ ఈవెంట్ని వాయిదా వేశారు.
త్ంవరలోనే ప్రమోషన్స్ని టీమ్ ప్రారంభించబోతోంది. కమల్, మణిరత్నంలతో కలిసి ఈ మూవీని యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చి వైరల్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రూ.149.7 కోట్లకు దక్కించుకుందని తెలిసింది. ఇటీవలే ఈ డీల్ని మేకర్స్ పూర్తి చేశారని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని విజయ్ టీవి రికార్డు ప్రైజ్ కు దక్కించుకుందట. ఏకంవగా ఈ మూవీ శాటిలైట్ హక్కులకు విజయ్ టీవి రూ.60 కోట్లు చెల్లించిందని, ఈ మధ్య కాలంలో కమల్ సినిమాకు దక్కిన భారీ ఆఫర్ ఇదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంటే ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమాకు రూ.210 కోట్ల వరకు వచ్చినట్టే. అంటే టీమ్ రిలీజ్కు ముందే లాభాల్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక థియేట్రికల్ హక్కుల రూపంలో కమల్, మణిరత్నంకు భారీ లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.