Begin typing your search above and press return to search.

క‌హో నా ప్యార్ హై 2 కోసం రెడీ!

లేటెస్ట్ బ్లాక్ బస్ట‌ర్ 'గ‌ద‌ర్ 2' సీనియ‌ర్ న‌టి అమీషా ప‌టేల్ లో బోలెడంత జోష్ నింపింది. ఇటీవ‌ల వ‌రుస‌గా మీడియా చిట్ చాట్‌ల‌తో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 3:45 AM GMT
క‌హో నా ప్యార్ హై 2 కోసం రెడీ!
X

లేటెస్ట్ బ్లాక్ బస్ట‌ర్ 'గ‌ద‌ర్ 2' సీనియ‌ర్ న‌టి అమీషా ప‌టేల్ లో బోలెడంత జోష్ నింపింది. ఇటీవ‌ల వ‌రుస‌గా మీడియా చిట్ చాట్‌ల‌తో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. నిరంత‌రం ఏదో ఒక మీడియాను క‌లుస్తూ లేదా సోష‌ల్ మీడియాల్లో చాట్ సెష‌న్లు నిర్వ‌హిస్తూ త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకుంటోంది. మ‌రోవైపు యూత్ త‌న‌ని మ‌ర్చిపోకుండా 48 ఏళ్ల అమీషా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తాజాగా అమీషా ప‌టేల్ షేర్ చేసిన ఫోటోషూట్ కుర్ర‌కారు గుండె ల‌య త‌ప్పేలా చేస్తోంది. వైట్ ఇన్న‌ర్.. డెనిమ్ స్లిట్ లేస్ షార్ట్ లో మైండ్ బ్లాక్ చేసింది అమీషా. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రాన్ని ఒక ఊపు ఊపేస్తోంది.


ప‌నిలో ప‌నిగా ఇప్ప‌టికిప్పుడు రాకేష్ రోష‌న్ క‌హోనా ప్యార్ హై సీక్వెల్ ని తెర‌కెక్కిస్తే హృతిక్ స‌ర‌స‌న న‌టించేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతోంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే 2000లో అమీషా పటేల్ 'కహో నా...ప్యార్ హై' చిత్రంతో తన కెరీర్‌ని ప్రారంభించింది. గదర్: ఏక్ ప్రేమ్ కథా, ఆప్ ముజే అచ్ఛే లగ్నే లగే, మంగళ్ పాండే: ది రైజింగ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, హుమ్‌రాజ్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో వేడెక్కించే పాత్ర‌ల‌తో మైమ‌రిపించింది. అయితే ఎన్ని సినిమాల ఉన్నా త‌న డెబ్యూ సినిమా KNPH లో సోనియా సక్సేనా పాత్ర ఇప్పటికీ చిరస్మరణీయమైనది. హృతిక్ - అమీషా మధ్య కెమిస్ట్రీ వెండి తెరపై మ్యాజిక్ సృష్టించింది. ఆ సినిమా విడుదలైనప్పటి నుండి అభిమానులు రొమాంటిక్-డ్రామాకు సీక్వెల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నోయిడాలో ఇటీవల జరిగిన పచౌలీ లక్స్ లాంచ్‌లో అమీషా ఈ చిత్రం సీక్వెల్ గురించి మాట్లాడింది.

'కహో నా ప్యార్ హై 2'పై అమీషా పటేల్ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ ప్రశ్నలకు నిర్మాతలు ఉత్తమంగా సమాధానం ఇస్తారని నేను భావిస్తున్నానని అంది. పార్ట్ 2తో మంచి హిట్ సినిమా తీయాలి అని ఆకాంక్షిస్తున్నాను. మంచి కంటెంట్ తో బాగా తీస్తే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్లు ఎప్పుడూ మంచినే చేస్తాయి. ఎందుకంటే సీక్వెల్ ఎప్పుడూ ప్రజల హృదయాల్లో చోటు క్రియేట్ చేసుకుంటుంది. కాబట్టి పార్ట్ 2 కోసం ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది.. అని త‌న‌దైన శైలిలో విశ్లేషించింది. అయితే క‌హోనా ప్యార్ హై సీక్వెల్ తెర‌కెక్కిస్తే అందులో అమీషా హీరోయిన్ కి మ‌మ్మీ పాత్ర‌ను పోషిస్తుందా? అన్న‌ది మాత్రం తేల‌లేదు.

తాజా చిత్రం 'గదర్ 2' విజయంపై అమీషా పటేల్ మ‌రోసారి త‌న ఆనందాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నారు. నోయిడా వేదిక‌పై గ‌ద‌ర్ 2 విజ‌యం గురించి ముచ్చ‌టించింది. ఈ చిత్రం అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం మ‌ర‌పురానిద‌ని అన్నారు. గదర్ 2 చిత్రం గదర్ ( ఏక్ ప్రేమ్ కథ) విడుదలైన 22 సంవత్సరాల తర్వాత వ‌చ్చింది. తారా సింగ్ - సకీనా జంట తిరిగి పెద్ద తెరపైకి వ‌చ్చి అభిమానుల‌ను మెప్పించారు. స‌కీనా పాత్ర‌లో అమీషా న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

సినిమా విజయం గురించి అమీషా మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా ప్రజల ప్రేమ నాపై ఉంది. ఏళ్లుగా నేను ఎక్కడికి వెళ్లినా జనాలు గదర్ గురించి అడుగుతున్నారు. ప్రజల హృదయాలకు బాగా దగ్గరైన సినిమా ఇది. మేము 2 సంవత్సరాల క్రితమే సినిమా అనౌన్స్ చేసి గదర్ 2 తీస్తున్నామని చెప్పుకున్నాం. జనంలో ఉన్న ఎక్సయిట్‌మెంట్ అంతా ఇంతా కాదు.. తార, సకీనా జంటను తిరిగి చూసేందుకు జనాలు ఎగబడుతున్నారని నాకు తెలుసు.. కానీ ఆ ఫీలింగ్ చాలా అందంగా ఉంది. భారతదేశంలోని అతిపెద్ద చిత్రాలలో ఈ సినిమా ఒక‌టిగా నిలిచింది. సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 500 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని చేరింది. కాబట్టి ప్రేక్షకుల ప్రేమతోనే ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.. అని తెలిపింది. బాలీవుడ్ చాలా కష్టకాలంలో ఉన్న స‌మ‌యంలో ఐసియు నుండి బ‌య‌ట‌ప‌డేసింది గ‌ద‌ర్ 2. అందుకే గదర్ 2 విజయం మరింత గొప్ప‌ది.. అని చాటింగ్ సెష‌న్ ని ముగించింది.