Begin typing your search above and press return to search.

త‌న పెళ్లి వెన్యూ ఎక్క‌డో చెప్పిన జాన్వీ

పెళ్లాడితే తిరుమ‌లలో శ్రీ‌వారి చెంత‌నే పెళ్లాడుతాన‌ని ఖాయం చేసిన ఈ బ్యూటీ కంచిప‌ట్టు చీర‌లో త‌ళ‌త‌ళా మెరవాల‌ని క‌ల‌లు కంటున్న‌ట్టు తెలిపింది.

By:  Tupaki Desk   |   14 April 2024 8:41 AM GMT
త‌న పెళ్లి వెన్యూ ఎక్క‌డో చెప్పిన జాన్వీ
X

బాలీవుడ్ లో నిరూపించుకుని టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది జాన్వీ క‌పూర్. ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర చిత్రంలో న‌టిస్తున్న జాన్వీ త‌దుప‌రి రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు చిత్రంలోను ఆడిపాడుతోంది. కెరీర్ మ్యాట‌ర్ అటుంచితే.. ఇటీవ‌ల త‌న స్నేహితుడు, ప్రియుడు అయిన మాజీ ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డు శిఖ‌ర్ ప‌హారియాను పెళ్లాడుతుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ జంట ప‌బ్లిగ్గానే షికార్లు చేయ‌డం, ఇటీవ‌ల బోనీ- జాన్వీ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో వారి బంధాన్ని ఖ‌రారు చేయ‌డం తెలిసిందే.

ఇక త‌న క‌ల‌ల పెళ్లి గురించి జాన్వీ క‌పూర్ చాలా సార్లు బ‌హిరంగంగా వ్యాఖ్యానించింది. తాను ఎప్ప‌టికి అయినా తిరుప‌తిలోనే పెళ్లాడుతాన‌ని, కాంచీవ‌రం ప‌ట్టుచీర‌లో పెళ్లికూతురుగా ముస్తాబు అవుతాన‌ని గ‌తంలో చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు కూడా మ‌రోసారి జాన్వీ ఇదే మాటను చెప్పింది. పెళ్లాడితే తిరుమ‌లలో శ్రీ‌వారి చెంత‌నే పెళ్లాడుతాన‌ని ఖాయం చేసిన ఈ బ్యూటీ కంచిప‌ట్టు చీర‌లో త‌ళ‌త‌ళా మెరవాల‌ని క‌ల‌లు కంటున్న‌ట్టు తెలిపింది.

త‌నకు సింపుల్ అండ్ బేసిక్ పెళ్లి ఇష్ట‌మ‌ని చెప్పిన జాన్వీ ఈ వేడుక‌ల‌ను రెండు రోజుల్లో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గ‌తంలో ఓసారి పీకాక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జాన్వీ తన బ్యాచిలొరెట్ పార్టీని 'కాప్రిలో, యాచ్‌లో' జ‌ర‌పాల‌ని, వివాహం తిరుపతిలో జరుగుతుందని చెప్పింది. త‌మిళ‌నాడు మైలాపూర్‌లోని ఒక ఇంట్లో (శ్రీదేవి పూర్వీకుల ఇల్లు) ప్రీవెడ్డింగ్ వేడుక‌లు జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు కూడా జాన్వీ తెలిపింది. బంగారం అద్దిన‌ కంజీవరం లేదా పట్టు పావడాయి చీర మెహందీకి గులాబీ రంగు చీర‌లో క‌నిపిస్తాన‌ని కూడా తెలిపింది.

ఇప్పుడు మ‌రోసారి పెళ్లి గురించి మాట్లాడుతూ కాంచీపురం ప‌ట్టుచీర క‌ట్టుకోవాల‌ని, మ‌ల్లెపూలు పెట్టుకోవాల‌ని, కాబోయే వాడు పంచె క‌ట్టుకోవాల‌ని కూడా తెలిపింది. పెళ్లి విందును అర‌టి ఆకులో వ‌డ్డించాల‌ని కూడా కోరుకుంది. త‌న‌కు కొంచెం సిగ్గు ఎక్కువ కాబ‌ట్టి త‌క్కువ మంది పెళ్లికి హాజ‌ర‌య్యేలా చూస్తాన‌ని, ఎందుకంటే పెళ్లిలో అంద‌రూ త‌న‌నే చూస్తే సిగ్గు ప‌డ‌తాన‌ని కూడా జాన్వీ వెల్లడించింది.

తన భర్త ఎలా ఉండాలో కూడా జాన్వీ గ‌తంలో తెలిపింది. నేను తెలివైన యువ‌కుడిని పెళ్లి చేసుకుంటాను.. అని కూడా చెప్పింది. అయితే అప్ప‌ట్లోనే తాను ఇంకా తెలివైన యువ‌కుల‌లో ఒకరిని ఇంకా కలవలేదు అని అంది. కానీ ఇప్పుడు శిఖ‌ర్ ప‌హారియాతో స‌న్నిహితంగా ఉంటోంది గనుక త‌న పెళ్లి అత‌డితోనే అని భావించాల్సి ఉంటుంది. అయితే కెరీర్ స్పీడ్ మీద ఉన్న క్ర‌మంలో ఇప్ప‌ట్లో పెళ్లి ఉంటుందా ఉండ‌దా? అనేదానికి స‌రైన క్లారిటీ రావాల్సి ఉంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే జాన్వీ న‌టించాల్సిన కొన్ని బాలీవుడ్ సినిమాల‌కు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో బ్రేక్ ప‌డింది. అదే క్ర‌మంలో టాలీవుడ్ లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.