వరుస పెట్టి అపార్ట్మెంట్లు కొంటున్న నటుడు
ఒక సాధారణ నటుడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. మొదట వాయిస్ ఆర్టిస్ట్. ఆ తరవాత నటుడు.
By: Tupaki Desk | 18 Jun 2025 9:24 AM ISTఒక సాధారణ నటుడు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. మొదట వాయిస్ ఆర్టిస్ట్. ఆ తరవాత నటుడు. ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఉత్తరాది దక్షిణాది రెండు చోట్లా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇదంతా డిజిటల్ మాయాజాలం. అసలు ఎవరు ఎవరో తెలీని ఈ రంగుల ప్రపంచంలో ఎలాంటి నేపథ్యం లేకుండా కూడా ఫేమస్ అవ్వొచ్చు. అలాంటి అవకాశాలు నటులకు వస్తున్నాయి. లక్షలు, కోట్లలో ఆర్జన. కొందరు తమ సంపాదనను తెలివిగా రియల్ వెంచలర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. అవి వేగంగా పెరిగి వారి నికర ఆస్తుల విలువను పెంచుతున్నాయి.
ఇప్పుడు ఆ కోవకే చెందుతాడు బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లవత్. అతడు, అతడి భార్య జ్యోతి హుడా ముంబైలోని అంధేరీలో రూ.10 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారని స్క్వేర్యార్డ్స్ పేర్కొంది. పూర్ణ అపార్ట్మెంట్స్ అనే భవనంలోని 14వ అంతస్తులో అహ్లవత్ 2వ అపార్ట్మెంట్ కొనుగోలు చేసాడు. 1950 చదరపు అడుగులు (181 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 217.47 చదరపు అడుగులు అంతర్నిర్మిత ప్రాంతాన్ని ఈ ఫ్లాట్ కలిగి ఉంది. గత మేలో ఇదే భవంతిలో అతడు 13వ అంతస్తులో మరో అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసాడు. ఇప్పుడు కొత్త అపార్ట్ మెంట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయింది. తాజా ఫ్లాట్ కి రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 60 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించినట్లు స్క్వేర్యార్డ్స్ తెలిపింది. జైదీప్ అహ్లవత్ మే 2025లో అదే భవనంలో రూ.10 కోట్లకు ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ అపార్ట్ మెంట్ 1,950 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 2,341 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియా కలిగి ఉంది. నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి . రూ.60 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేసారు. రెండు అపార్ట్మెంట్లను దినేష్ బన్సాల్ మరియు కవితా బన్సాల్ సహా బన్సాల్ కుటుంబ సభ్యుల నుండి కొనుగోలు చేశారు.
జైదీప్ బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లతో పాపులరయ్యాడు. రయీస్ (2017), రాజీ (2018) చిత్రాలలో తన పాత్రలకు గుర్తింపు పొందాడు. 2020లో పాతాల్ లోక్లో పోలీసు అధికారిగా నటించాడు. దీనికి అతను డ్రామా సిరీస్లో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డును అందుకున్నాడు. నెట్ఫ్లిక్స్ చిత్రం జ్యువెల్ థీఫ్ (2025)లో సైఫ్ అలీ ఖాన్తో కలిసి కనిపించాడు. రాజ్ అండ్ డీకే ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3లోను జైదీప్ అహ్లావత్ నటిస్తున్నాడు.
