Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ పెళ్లికి సిద్ధమవుతోందా?

శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ ని తెర‌పై చూసుకుని ఆనందించాల‌ని తెలుగు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:14 AM GMT
జాన్వీ కపూర్ పెళ్లికి సిద్ధమవుతోందా?
X

శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ ని తెర‌పై చూసుకుని ఆనందించాల‌ని తెలుగు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ కోరిక ఎన్టీఆర్ `దేవ‌ర`తో తీర‌నుంది. జాన్వీ కపూర్ `దేవర` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో గ్లామ‌ర‌స్ లుక్ తో పాటు త‌న‌దైన‌ న‌ట‌న‌తోను మెరిపిస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే జాన్వీ డైహార్డ్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేని ఒక విష‌యం ఒక‌టి ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది.

జాన్వీ కపూర్ కి స్కూల్ కాలేజ్ డేస్ నుంచి మంచి స్నేహాలు ఉన్నాయి. అందులో ఒక స్నేహితుడు శిఖ‌ర ప‌హారియాతో జాన్వీ డేటింగ్ చేస్తోంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. ఇక ప‌హారియా కుటుంబంతో బోనీ కుటుంబానికి చాలా కాలంగా స‌త్సంబంధాలున్నాయి. ఇటీవలి ఊహాగానాల ప్ర‌కారం.. శిఖర్ పహారియాను జాన్వీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

శిఖ‌ర్ తో చాలా సార్లు జాన్వీ జంట‌గా ప‌బ్లిక్ లో క‌నిపించింది. దీంతో ఈ జంట డేటింగ్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్దరు కలిసి ఆలయ సందర్శనకు వెళ్ల‌డంతో ఇక ఈ జంట పెళ్లి ఖాయ‌మైన‌ట్టేన‌ని పుకార్ షికార్ చేస్తోంది. 5 డిసెంబర్ 2023 న వారు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ కలిసి ప్రార్థనలు చేసి ఆరతి- పూజలో జంటగా పాల్గొన్నారు. వారు కలిసి ఏడు వేడుకలను నిర్వహించే ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు సాగాయి. దీంతో ఈ జంట పెళ్లికి రెడీ అవుతోందంటూ పుకార్ మ‌రోసారి వేడెక్కిస్తోంది.

అయితే జాన్వీ కానీ..శిఖ‌ర్ కానీ.. వారి కుటుంబాలు కానీ దీనిపై ఎలాంటి అధికారిక వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. ఇప్ప‌టికి ఇవ‌న్నీ ఊహాగానాలు మాత్ర‌మేన‌ని భావించాలి. ముంబై మీడియాలో స్టార్ల ఎఫైర్ల‌పై విస్త్ర‌తంగా గాసిప్పులు షికార్ చేస్తున్నాయి. వీటిలో జాన్వీ- శిఖ‌ర్ జంట కూడా ఉన్నారని భావించాలి. జాన్వీ కపూర్ `దేవర` షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాతో సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. సెట్స్ లో ఉన్న సినిమాల్ని పూర్తి చేస్తే కానీ పెళ్లి అనే అంకం ఉండ‌దు. చాలా ముందు నుంచే ప్రీప్లాన్డ్ గా ప్ర‌తిదీ సాగాలి. అప్ప‌టికప్పుడు ఇవ‌న్నీ జ‌రిగేవి కాదు. దీపిక‌, అనుష్క శ‌ర్మ‌, కాజ‌ల్ లాంటి భామ‌లు పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో త‌మ ప్రాజెక్టుల‌ను ఒక‌టొక‌టిగా పూర్తి చేసి వెళ్లారు. ఇత‌రులు దీనిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అప్ప‌ట్లో నిర్మాత‌ బోనీ క‌పూర్ ని పెళ్లాడార‌ని స‌డెన్ గానే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు కూతురు జాన్వీ దానిని ఫాలో చేయ‌ద‌నే అభిమానులు భావిస్తున్నారు.