Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ 'కాంతార' ఫార్మెట్ ని ఫాలో అవుతున్నాడా?

మ‌రోవైపు గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన `ధృవ‌న‌క్ష‌త్రం`పైనే కూడా అంచ‌నాలు అదే స్థాయిలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   22 April 2024 6:34 AM GMT
ఆ డైరెక్ట‌ర్ కాంతార ఫార్మెట్ ని ఫాలో అవుతున్నాడా?
X

చియాన్ విక్ర‌మ్ `తంగ‌లాన్` రిలీజ్ కి ముందు సంచ‌ల‌నాలు రేపుతున్నాడు. తంగ‌లాన్ పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చాయి. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో చియ‌న్ బౌన్స్ బ్యాక్ అవ్వ‌డం ఖాయమంటూ అంతా అంచ‌నాలు పెట్టుకున్నారు. మ‌రోవైపు గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన `ధృవ‌న‌క్ష‌త్రం`పైనే కూడా అంచ‌నాలు అదే స్థాయిలో ఉన్నాయి.


ఇలా ఈ రెండు సినిమాల‌తో విక్ర‌మ్ జ‌నాల నోళ్ల‌లో బాగా నానుతున్నాడు. ఇటీవ‌లే విక్రమ్ బర్త్ డే సందర్భంగా మ‌రో స‌ర్ ప్రైజ్ కూడా ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ` వీర ధీర శూరన్` అనే కొత్త సినిమా టీజ‌ర్ తోనే ట్రీట్ ఇచ్చేసాడు. మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్‌లో విక్రమ్ అదరగొట్టేశాడు. విక్రమ్‌ని ఎక్కువగా చూపించకపోయినా ఎలివేష‌న్ మాత్రం అదిరిపోయింది. ఎస్.యు అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు మ‌రిన్ని వివ‌రాలు రివీల్ చేసారు.

ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..`ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా. ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది. కానీ డ్రామా ప్రధాన అంశంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జ‌రుగుతున్నాయి. పార్ట్ 1 కూడా ఉంది. కానీ మేము ముందుగా పార్ట్ 2 పై మాత్రమే దృష్టి పెట్టాం. దాన్నే ముందు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. టైటిల్ టీజర్‌లోనే సినిమా ప్రపంచాన్ని చూపించాను` అని అన్నారు. అంటే ఈ సినిమాకి ప్రీక్వెల్ త‌ర్వాత తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డ ఈ సినిమా `కాంతార` ఫార్మెట్ లో తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తోంది.

రిష‌బ్ శెట్టి కాంతార‌ని ముందుగా రెండ‌వ భాగం రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అది అనూహ్యంగా పాన్ ఇండియాలో 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో ప్రీక్వెల్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక్క‌డ అరుణ కూడా ఇదే పార్మెట్ లో `వీర ధీర శూర‌న్` తెర‌కెక్కుతోంది. ఇందులో ఎస్‌జే సూర్య, దుషార విజయన్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.