Begin typing your search above and press return to search.

యుద్ధంతో భార‌తీయ సినిమాకి ముప్పు?

ఇక‌పై భార‌తీయ సినిమాల‌ను పాన్ ఇండియాలో విజ‌య‌వంతంగా ఆడించాలంటే దానిపైనా కొన్ని ఆంక్ష‌ల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.

By:  Tupaki Desk   |   9 May 2025 9:30 PM IST
యుద్ధంతో భార‌తీయ సినిమాకి ముప్పు?
X

భార‌త్ - పాక్ యుద్ధం నేప‌థ్యంలో క‌ళారంగానికి ముప్పు ఎలా ఉండ‌బోతోంది? అంటే.. అది పెనుముప్పున‌కు దారి తెస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏ రంగంలో అయినా అభివృద్ధి జ‌ర‌గాలంటే అన్నిర‌కాలుగా ప‌రిస్థితిలు బావున్న‌ప్పుడే సాధ్య‌మ‌వుతుంది. ఇప్పుడు యుద్ధం కార‌ణంగా క‌ళారంగానికి కూడా ఇత‌ర రంగాల్లోనే తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఇక‌పై భార‌తీయ సినిమాల‌ను పాన్ ఇండియాలో విజ‌య‌వంతంగా ఆడించాలంటే దానిపైనా కొన్ని ఆంక్ష‌ల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న సినిమాల్ని చైనాలో బాగా మార్కెట్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. మారిన మార్కెట్ డైన‌మిక్స్ కార‌ణంగా తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచ స్థాయికి ఎదుగుతోంది. చైనాలోను మార్కెట్ ని పెంచుకోవాల‌ని చూస్తోంది.

కానీ దాయాది పాకిస్తాన్ కుయుక్తుల‌కు చైనాలో మ‌న‌కు(భార‌తీయ సినిమా) అనుకూల ప‌రిస్థితులు ఉండ‌క‌పోవ‌చ్చు. త‌ద్వారా అది మిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టానికి దారి తీయొచ్చు. అమీర్ ఖాన్ దంగ‌ల్, సీక్రెట్ సూప‌ర్ స్టార్ స‌హా చాలా భార‌తీయ చిత్రాలు చైనాలో అద్భుత వ‌సూళ్ల‌ను సాధించాయి. భార‌త‌దేశంలో అంత‌గా ఆడ‌ని సినిమాలు కూడా చైనాలో ఆడేందుకు అవ‌కాశం ఉంది. కానీ యుద్ధ ప‌రిస్థితుల్లో చైనా త‌మ దేశంలో భార‌త్ ని ఏ కోణంలోను ఎంక‌రేజ్ చేయ‌డానికి అవ‌కాశం ఉండ‌దు. క‌ళారంగానికి కూడా ఈ థ్రెట్ ఉంటుంది.

భార‌త్ - పాక్ యుద్ధ స‌మ‌యంలో చైనా మ‌ద్ధ‌తు పూర్తిగా పాకిస్తాన్ కి ఉంది. పాకిస్తాన్ ఆయుధ సామాగ్రిని బ‌లోపేతం చేసేందుకు చైనా సాయం చేస్తోంది. అలాగే భార‌త్ ఆర్థిక బ‌లాల‌పై ఆయుధ సంప‌త్తిపైనా దెబ్బ కొట్టాల‌ని చైనా భావించే వీలుంది. ఇలాంటి ఉద్రిక్త‌ ప‌రిణామాలు సినిమా రంగంపైనా అంతో ఇంతో ఉండొచ్చు. యుద్ధం కార‌ణంగా పాకిస్తానీ స్టార్లు పూర్తిగా బాలీవుడ్ లో అవ‌కాశాలు కోల్పోయారు. వారు ఎప్ప‌టికీ ఇక కోలుకోలేరు. అలాగే చాలా హిందీ సినిమాలు పాక్ లో విడుద‌ల‌వుతున్నాయి. ఇక‌పై దీనికి ఆస్కారం ఉండ‌దు. అలాగే భార‌తీయ సినిమా ప్ర‌పంచ వేదిక‌పై ఎద‌గాల‌ని చూస్తోంది. ఇటీవ‌ల వేవ్స్ 2025 స‌మ్మిట్ లో దీని గురించి చాలా చ‌ర్చ సాగింది. ఇలాంటి స‌మ‌యంలో పాక్ పై యుద్ధం అనివార్య‌మైంది. కానీ ఇది అంత శ్రేయ‌స్కారం కాదు. యుద్ధం కొన్ని రోజుల్లోనే నిలిచిపోయి ప్ర‌జాజీవ‌నం సాధార‌ణ స్థితికి రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. విషాదాల‌తో కునారిల్లే ప్ర‌జ‌ల మైండ్ ని రీఫ్రెష్ చేసే క‌ళారంగానికి జ‌వ‌జీవాలు రావాలంటే ప్ర‌పంచ శాంతి చాలా ముఖ్యం. దానిని ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లే సృష్టించుకోవాల్సి ఉంది.