Begin typing your search above and press return to search.

అమ్మను దూరం పెట్టి తప్పు చేశా : జాన్వీ కపూర్‌

తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ధడక్ షూటింగ్‌ సమయంలో అమ్మ పక్కన ఉండటం ను ఇష్ట పడేదాన్ని కాదు

By:  Tupaki Desk   |   15 Dec 2023 1:30 PM GMT
అమ్మను దూరం పెట్టి తప్పు చేశా : జాన్వీ కపూర్‌
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌ లో ధడక్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో పలు సినిమాలు మరియు సిరీస్ ల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అయితే సక్సెస్ లు లేకపోవడంతో కమర్షియల్‌ గా జాన్వీ కపూర్ కి బ్రేక్ దక్కలేదు. అయినా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. త్వరలో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

తెలుగు లో ఎన్టీఆర్‌ కు జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ నటిస్తున్న 'దేవర' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ సినిమా తో జాన్వీ కపూర్‌ కమర్షియల్‌ హిట్‌ ఖాతా తెరవడం ఖాయం అనిపిస్తోంది. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌ తన తల్లిని బాగా మిస్‌ అవుతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ధడక్ షూటింగ్‌ సమయంలో అమ్మ పక్కన ఉండటం ను ఇష్ట పడేదాన్ని కాదు. అమ్మ షూటింగ్ సెట్‌ కి వస్తానన్నా కూడా వద్దు అనేదాన్ని. అమ్మ సెట్‌ కి వస్తే నేను అమ్మ వల్లే ఆఫర్లు పొందుతున్నట్లుగా జనాలు ఫీల్ అవుతారేమో అనుకునేదాన్ని. ఎప్పుడూ కూడా అమ్మ పక్కన ఉంటే స్టార్‌ కిడ్‌ ఇమేజ్ ని కట్టబెడుతారని భయపడేదాన్ని.

సినిమాలకు సంబంధించి ఏ విషయంలో కూడా అమ్మ నాకు సహాయం చేయవద్దని అనేదాన్ని. ఇప్పుడు నేను ఎంత ఫూలిష్ గా ఆలోచించానో అర్థం అవుతుంది. అమ్మ లేని లోటు ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మ నాతో షూటింగ్ కు రావాలని, నేను చేస్తున్న సినిమాలకు సంబంధించిన విషయాలను అమ్మతో పంచుకోవాలని ఇప్పుడు కోరుకుంటున్నాను.

అమ్మ నాకు ఈ రోజు షూట్‌ ఉందని చెప్పాలని ఉంటుంది. కాని అమ్మ లేకపోవడంతో నిరుత్సాహంగా ఉంటుందని జాన్వీ ఎమోషనల్‌ అయ్యింది. ఇప్పుడు శ్రీదేవి కూతురు అంటూ అంతా నన్ను పిలుస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందని కూడా జాన్వీ కపూర్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఒకప్పుడు అమ్మ కి కూతురు అని చెప్పుకునేందుకు భయపడ్డ నేను ఇప్పుడు శ్రీదేవి కూతురు అయినందుకు సంతోషిస్తున్నాను. అప్పుడు అమ్మను దూరం పెట్టి తప్పు చేశాను అంటూ జాన్వీ కపూర్‌ ఎమోషనల్‌ అయ్యింది.