Begin typing your search above and press return to search.

రెండు గంటలు మాట్లాడితే వారిలాగే...!

సినిమా విడుదల ముందు మహేష్‌ బాబు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం వచ్చాడు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:40 PM GMT
రెండు గంటలు మాట్లాడితే వారిలాగే...!
X

సంక్రాంతికి సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా వచ్చిన విషయం తెల్సిందే. సినిమా విడుదల ముందు మహేష్‌ బాబు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం వచ్చాడు. కాని ఇతర మీడియా సమావేశాలు, స్పెషల్‌ ఇంటర్వ్యూలకు టైం కేటాయించలేదు.

సినిమా విడుదల అయిన తర్వాత మహేష్ బాబు ప్రమోషన్‌ లో పాల్గొంటున్నాడు. శ్రీలీల తో కలిసి సుమ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు చాలా సరదాగా మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మహేష్ బాబు మాట్లాడుతూ... తాను ఎవరితో అయినా రెండు గంటలు మాట్లాడితే చాలు... వారి మాట తీరును, వారి బాడీ లాంగ్వేజ్ ను పట్టేసి అచ్చు వారిలా మాట్లాడేయలను. అలా చాలా సార్లు త్రివిక్రమ్‌ గారి ముందు ఇతరులు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉండేవాడిని.. అదే ఇందులో తీసుకున్నాడు.

సన్నివేశాలకు అనుగుణంగా త్రివిక్రమ్‌ ఒక సారి ఇలా మాట్లాడారు కదా అలా ఈ సీన్ లో చేయండి అంటూ చెప్పేవారు. అలా గుంటూరు కారం సినిమాలో నాతో సన్నివేశాలు చేయించారు. ఖలేజా లో కూడా అలాగే చాలా సన్నివేశాలను చేయించాడు. అందుకే ఆ సినిమాలో సన్నివేశాలు చాలా నేచురల్ గా ఉంటాయని మహేష్ బాబు అన్నాడు.

ఇక శ్రీలీలతో వర్క్‌ చేయడం పట్ల మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు, ఆమెపై ప్రశంసలు కురిపించాడు. శ్రీలీల డాన్స్ విషయమై మహేష్ బాబు మరోసారి ప్రశంసలు కురిపిస్తూ అభినందనలు తెలియజేశాడు. గుంటూరు కారం సినిమా కు వస్తున్న ప్రశంసలకు మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశాడు.