Begin typing your search above and press return to search.

G2 : విలన్ కి షాకింగ్ పారితోషికం

అడివి శేష్‌ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్‌ బస్టర్ 'గూడాచారి'. ఆ సినిమా సీక్వెల్‌ ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 10:30 AM GMT
G2 : విలన్ కి షాకింగ్ పారితోషికం
X

అడివి శేష్‌ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్‌ బస్టర్ 'గూడాచారి'. ఆ సినిమా సీక్వెల్‌ ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. ఎట్టకేలకు అడివి శేష్‌ సీక్వెల్‌ ను మొదలు పెట్టాడు. స్వయంగా తానే స్క్రిప్ట్‌ ను రెడీ చేసి ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న విషయం తెల్సిందే.


ఈ సీక్వెల్‌ ను చిన్న సినిమాగా కాకుండా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్‌, పీపుల్స్ మీడియా మరియు అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ లు భాగస్వామిగా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమా కోసం ఇమ్రాన్ కి ఏకంగా రూ.7 కోట్ల పారితోషికం ను ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో నిజం అనేది తెలియదు కానీ మీడియా మరియు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

విన్య కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతోంది. గుడాచారి సినిమా హిట్ నేపథ్యంలో అదే కాన్సెప్ట్‌ తో, అందులోని కొన్ని పాత్రలను తీసుకుని అడివి శేష్‌ కథను అల్లినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో అడివి శేష్‌ కి జోడీగా బనితా సంధు హీరోయిన్‌ గా నటిస్తోంది. ఆమె కూడా ఈ సినిమా లో నటించేందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విలన్‌ ఇమ్రాన్ హష్మీ కే రూ.7 కోట్ల పారితోషికం ఇస్తే హీరో అడివి శేష్‌ ఏ స్థాయిలో పారితోషికం తీసుకోబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.