Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:39 PM GMT
గుంటూరు కారం.. టికెట్ రేట్లు ఎంత పెరిగాయంటే..
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా గుంటూరు ఘాటును చూపించేందుకు జనవరి 12వ తేదీన థియేటర్స్ లోకి వచ్చేస్తున్నారు మహేశ్. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో మహేశ్ సినిమాకు ఉండాల్సిన హైప్ వచ్చేసింది. సూపర్ స్టార్ మాస్ ర్యాంపేజ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అయింది. అయితే ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల అనుమతుల కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.

టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించేసింది. అన్ని థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈనెల 12 నుంచి పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపునకు వెసులుబాటు కల్పించింది.

ప్రభాస్ సలార్ చిత్రం కంటే ఇది ఎక్కువ మొత్తమే అని చెప్పొచ్చు. సలార్ చిత్రానికి 40 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంపునకు రాష్ట్ర సర్కార్ అనుమతులు ఇచ్చింది.

ఇప్పటికే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ఆంధ్రాలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. మాస్-ఫ్యామిలీ-కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో గుంటూరు కారం మూవీని తెరకెక్కించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.

అతడు, ఖలేజా మూవీల తర్వాత మరోసారి వీరిద్దరు చేతులు కలిపారు. మహేశ్‌ సరసన హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. తమన్ సంగీతమందించగా.. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.