Begin typing your search above and press return to search.

గోపీచంద్ క్రేజీ కాంబో.. రంగంలోకి బడా నిర్మాణ సంస్థ

ఇప్పుడు ఈ మూవీలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. 'గోపీచంద్ 32' మూవీ కోసం చిత్రాలయం స్టూడియోస్ తో చేతులు కలిపింది.

By:  Tupaki Desk   |   27 March 2024 12:19 PM GMT
గోపీచంద్ క్రేజీ కాంబో.. రంగంలోకి బడా నిర్మాణ సంస్థ
X

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. గట్టి కమ్ బ్యాక్ ఇవ్వలేకపోతున్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నా.. ఫలితాలు ఆశించినట్లు రావడం లేదు. ఇటీవల భీమా మూవీతో వచ్చినా.. గోపీచంద్ మెప్పించలేక పోయారు. మార్చి 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ అందుకుంది.

ఇక త్వరలోనే ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే గోపీచంద్ ఇప్పుడు తన ఆశలన్నీ తన నెక్స్ట్ మూవీపైనే పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ను సరికొత్త అవతార్ లో శ్రీను వైట్ల చూపించనున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి.. తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌ పై భారీ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. 'గోపీచంద్ 32' మూవీ కోసం చిత్రాలయం స్టూడియోస్ తో చేతులు కలిపింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా మారారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌ తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని వేణు దోనేపూడి తెలిపారు. సినిమా అవుట్ పుట్ బాగా వస్తున్నట్టు చెప్పారు. అత్యున్నత స్థాయి నిర్మాణం, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త షూటింగ్ షెడ్యూల్ తాజాగా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ప్రధాన తారాగణం తో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు చెప్పారు.

అయితే కొత్త షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి కానుంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి. పలు బ్లాక్‌ బస్టర్ సినిమాలకు వర్క్ చేసిన గోపీ మోహన్ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి మరి.