Begin typing your search above and press return to search.

వైరల్ పిక్‌ : 20 ఏళ్ల నాటి ఎర్ర గులాబీ

టాలీవుడ్ హాసిని జెనీలియా సినిమాల్లో యాక్టివ్ గా లేకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం తరచు ఫోటోలు షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 9:47 AM GMT
వైరల్ పిక్‌ : 20 ఏళ్ల నాటి ఎర్ర గులాబీ
X

టాలీవుడ్ హాసిని జెనీలియా సినిమాల్లో యాక్టివ్ గా లేకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం తరచు ఫోటోలు షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో జెనీలియా ప్రేమ కథ మరియు ఆమెకు రితేష్ ఇచ్చిన మొదటి ప్రేమ కానుక విషయం చర్చనీయాంశం అయ్యింది.


జెనీలియా - రితేష్ దేశ్‌ముఖ్‌ లు 2003 లో పరిచయం అయ్యారు. తుజే మేరీ కసమ్ సినిమాతో వీరి పరిచయం ఏర్పడింది. రితేష్ కు ఆ సినిమా మొదటి సినిమా. రాజకీయ నాయకుడు విలాస్ రావ్‌ దేశ్‌ముఖ్‌ తనయుడు అయిన రితేష్‌ దేశ్ ముఖ్‌ తో సినిమా అనగానే జెనీలియా టెన్షన్ పడిందట.

ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడి తనయుడు అవ్వడం వల్ల రితేష్ కి పొగరు ఉంటుందని అనుకున్నాను. కానీ అతడు చాలా సింపుల్ గా ఉండేవాడు. మొదటి సినిమాతో మా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో జెనీలియా తనకు రితేష్ ఇచ్చిన మొదటి ప్రేమ కానుక గురించి మాట్లాడింది. 20 ఏళ్ల క్రితం రితేష్ తనకు ఎర్ర గులాబీ ఇచ్చాడు. ఆ గులాబీ ఇప్పటికి కూడా తన వద్ద ఉందని జెనీలియా పేర్కొంది.

మొత్తానికి జెనీలియా ప్రేమ ఎంతో మందికి ఆదర్శం. రితేష్ మరియు జెనీలియా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా సందడి చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు అయినా కూడా ఇద్దరి మధ్య ఏమాత్రం అన్యోన్యం తగ్గలేదని వారి రీసెంట్‌ వీడియోలు మరియు సోషల్ మీడియా పోస్ట్‌ లు చూస్తే అర్థం అవుతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.