Begin typing your search above and press return to search.

'జరగండి జరగండి' ఆగయా.. పాటలో ఏం మార్చారంటే..

మరోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులు చాలావరకు ఆలస్యంగా ఫినిష్ అవుతూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 March 2024 4:36 AM GMT
జరగండి జరగండి ఆగయా.. పాటలో ఏం మార్చారంటే..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కంటే కూడా అప్డేట్స్ కోసమే ఫ్యాన్స్ చాలా కాలం పాటు ఎదురు చూసారు అని చెప్పవచ్చు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఏ సినిమా రూపొందిన కూడా పక్క ప్రణాళికతో ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కానీ గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మాత్రం పరిస్థితులు ఏమాత్రం అనుకోనించలేదు.


మరోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులు చాలావరకు ఆలస్యంగా ఫినిష్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా టీజర్ నుంచి సాంగ్స్ వరకు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో చాలా కాలం సస్పెన్స్ కొనసాగింది. అందుకు కారణం సినిమా షూటింగ్ అనుకున్నా ప్లాన్ కు తగ్గట్టుగా పూర్తి కాకపోవడమే.

రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన తర్వాతనే సినిమా అప్డేట్స్ ఒకదాని తర్వాత మరొకటి ఇవ్వాలి అని అనుకున్నారు. ఇక మొత్తానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. జరగండి జరగండి. అనే ఈ పాట లిరికల్ వీడియోలో రామ్ చరణ్ - కియార అద్వానీ జోడి మాస్ లుక్స్ తో స్టైలిష్ గా స్టెప్పులు వేశారు. శంకర్ మార్క్ కు తగ్గట్టుగా సెట్ వర్క్ హైలెట్ అయ్యింది.

తమన్ స్వరపరిచిన ఈ పాటను దలేర్ మెహింది, సునీత చౌహన్ పాడారు. గతంలోనే ఈ పాట సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వేరే సింగర్స్ తో పాడించిన థమన్ ఇప్పుడు మాత్రం టాప్ సింగర్స్ చేత పాడించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సాంగ్ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

ఈ రోజుల్లో ఏ సినిమాకైనా సరే ముందుగా పాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తేనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టీజర్ ట్రైలర్ కూడా సినిమా బిజినెస్ కు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే అప్డేట్స్ మరింత బలంగా ఉండాలి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా విడుదల డేట్ పై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

రామ్ చరణ్ పుట్టినరోజు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారు అని ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ దిల్ రాజు ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు అని అర్థం అవుతుంది. అనుకున్నట్లు ప్లాన్స్ సెట్ అయితే మాత్రం ఈ ఏడాది సమ్మర్ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.