Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఆమె రోల్ అదేనా?

అయితే ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. అప్పట్లో జరగండి సాంగ్ లీక్ అవ్వగా, ఇప్పుడు హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ లుక్స్ లీకయ్యాయి.

By:  Tupaki Desk   |   18 March 2024 6:44 AM GMT
గేమ్ ఛేంజర్.. ఆమె రోల్ అదేనా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక షెడ్యూల్ షూటింగ్ జరగ్గా.. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతోంది. నటీనటులపై సినిమాలోని మెయిన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు గేమ్ ఛేంజర్ మేకర్స్.

అయితే ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. అప్పట్లో జరగండి సాంగ్ లీక్ అవ్వగా, ఇప్పుడు హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ లుక్స్ లీకయ్యాయి. క్లీన్ షేవ్ తో రామ్ చరణ్ డీసెంట్ లుక్ లో అదరగొట్టారు. ఫార్మల్ గెటప్, కళ్లద్దాలతో ఇంతవరకు ఎప్పుడూ చూడని లుక్ లో చరణ్ కనిపించారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుని సంబరపడిపోయారు.

అయితే లీకైన లుక్ లో కియారా అద్వానీ చీరలో అదిరిపోయింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈమె కేవలం డ్యాన్సులు, గ్లామర్ కు పరిమితం కాకుండా ఓ గవర్నమెంట్ అధికారిణి రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈమె లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. మొత్తానికి మేకర్స్.. ఎలాంటి అప్డేట్లు ఇవ్వకపోయినా లీక్డ్ పిక్స్ తోనే ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

కానీ ఈ లీకుల పట్ల మేకర్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో సినీ ప్రియులతోపాటు మెగా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మార్చి 27వ తేదీన చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జరగండి సాంగ్ రిలీజ్ చేస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతోపాటు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. చరణ్, కియారా తో పాటు శ్రీకాంత్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి ముగ్గురు ఆడిన పొలిటికల్ గేమే సినిమాలో మెయిన్ పాయింట్ గా సమాచారం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.