Begin typing your search above and press return to search.

22 ఏళ్ళ తరువాత సీక్వెల్.. ట్రైలర్ ఎలా ఉందంటే..

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సినిమా ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దారు.

By:  Tupaki Desk   |   27 July 2023 4:41 PM GMT
22 ఏళ్ళ తరువాత సీక్వెల్.. ట్రైలర్ ఎలా ఉందంటే..
X

2001లో రిలీజై, బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా 'గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ'. ఇప్పుడీ సినిమా కు కొనసాగింపుగా 22ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం 'గదర్‌ 2'. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ దేవోల్‌, అమీషా పటేల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్‌ శర్మ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సినిమా ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దారు.

'తారా సింగ్(సన్నీ దేవోల్) ను మీకు తెలీదా?.. శత్రువుల ను అడగండి ఎవరనేది చెబుతారు? అంటూ ఫైటింగ్ సీన్స్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో సన్నిదేవోల్ తన యాక్షన్ తో అదరగొట్టేశారు . ఇక అమీషా పటేల్, సన్నీదేవోల్ లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రచార చిత్రం లో చూపించిన సాంగ్ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటోంది.

పాకిస్థాన్ ఆర్మీ చేతి లో బంధించబడిన తన కొడుకును కాపాడి తీసుకొస్తానని అమీషా పటేల్ కు మాట ఇచ్చిన సన్నీదేవోల్, అక్కడి సాయుధ బలగాలతో ఎలా పోరాడాడు అనే సన్నివేశాల ను పవర్ ఫుల్ గా తెరకెక్కించారు. సన్నీదేవోల్ పవర్ ఫుల్ డైలాగ్ లు చెప్పి అదరగొట్టేశారు. మరి కొడుకును ప్రాణాలతో తీసుకొస్తానని అమీషా పటేల్ కు మాటిచ్చి అక్కడికి వెళ్ళిన సన్నీ దేవోల్.. వాళ్లతో ఎలా తడపడ్డాడు, వారిని ఎలా ఎదురించాడు, పాక్ చెర నుంచి కొడుకును ఎలా బయట కు తీసుకొచ్చాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

కాగా, దర్శకుడు అనిల్‌ శర్మ కుమారుడు ఉత్కర్షే.. సన్నీదేవోల్ కొడుకు పాత్ర పోషించాడు. అతడి నటన కూడా ఇంటెన్సివ్ గా ఉంది. మొత్తంగా.. అతడు(సన్నీ దేవోల్) తన కుటంబం కోసం, దేశం కోసం పోరాడే యోధుడు అంటూ ప్రచార చిత్రాన్ని ముగించారు. అనిల్‌ శర్మ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. 1971లో ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి పోటీగా అక్షయ్ కుమార్ ఓమైగాడ్ 2 కూడా ఇండిపెండెన్స్ డేన విడుదల కు రెడీ అయింది. కానీ సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది.

ఇకపోతే అమీషా పటేల్‌ టాలీవుడ్‌కు తెలిసిన నటే. పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన బద్రితో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఆ తర్వాత మహేశ్‌బాబు నాని, ఎన్టీఆర్‌ నరసింహుడు, బాలకృష్ణ పరమ వీర చక్రలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్‌ కు దూరమైన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చిత్రాలు చేస్తోంది.