Begin typing your search above and press return to search.

ఫిలింఛాంబ‌ర్ ఎన్నిక‌ల రేసులో ఎవ‌రు ముందంజ‌?

By:  Tupaki Desk   |   30 July 2023 11:45 AM GMT
ఫిలింఛాంబ‌ర్ ఎన్నిక‌ల రేసులో ఎవ‌రు ముందంజ‌?
X

తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఎన్నిక‌ల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ ముందంజ‌లో ఉంద‌ని స‌మాచారం. నేటి ఉద‌యం 7 గం.ల‌కు మొద‌లైన పోలింగ్ మ‌ధ్యాహ్నం 3గం.ల‌తో ముగియ‌గా.. సాయంత్రం 4 నుంచే ఓట్ల కౌంటింగ్ మొద‌లైంది. తాజా స‌మాచారం మేర‌కు సి.క‌ళ్యాణ్ ప్యానెల్ పై దిల్ రాజు ప్యానెల్ విజ‌యం ఖాయం కానుంద‌ని టాక్ వినిపిస్తోంది.

నిర్మాత‌ల సెక్టార్ లో 12 మందిలో దిల్ రాజు ప్యానెల్ నుంచి మెజారిటీ స‌భ్యులు ఎన్నిక‌య్యార‌ని టాక్ వినిపిస్తోంది. స్టూడియోస్ సెక్టార్ నుంచి దిల్ రాజుకు మెజారిటీ రాగా.. డిస్ట్రిబ్యూట‌ర్స్ సెక్టార్ నుంచి 50-50 గెలుపు దిల్ రాజు ప్యానెల్ కు సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు.

ఓవ‌రాల్ గా దిల్ రాజు ప్యానెల్ ఈ ఎన్నిక‌ల్లో ముందంజ‌లో ఉంది. ఇంకా గెలుపు గుర్రం ఎవ‌రు? అన్న‌ది ఖాయం కాలేదు. దీనిపై అధికారికంగా స‌మాచారం వెలువ‌డాల్సి ఉంది. స్టూడియోస్ సెక్టార్.. పంపిణీ సెక్టార్.. నిర్మాత‌ల సెక్టార్.. ఎగ్జిబిట‌ర్ సెక్టార్ .. ఈ నాలుగు సెక్టార్ల నుంచి స‌భ్యులు ఎన్నుకున్న ప్ర‌తినిధులు తిరిగి అధ్య‌క్షుడిని ఎన్నుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. రేసులో సి.క‌ళ్యాణ్ పై దిల్ రాజు ముందంజ‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఎన్నికైన అధ్య‌క్ష‌ కార్య‌వ‌ర్గం 2023-25 సీజ‌న్ కి పాల‌న సాగిస్తుంది.