Begin typing your search above and press return to search.

అందుకే సాయి పల్లవితో మళ్ళి చెయ్యలేదు

ఆ సినిమా తో సాయి పల్లవి మరియు వరుణ్‌ ఇద్దరికి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:04 AM GMT
అందుకే సాయి పల్లవితో మళ్ళి చెయ్యలేదు
X

మెగా హీరో వరుణ్‌ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తో సాయి పల్లవి మరియు వరుణ్‌ ఇద్దరికి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఫిదా తర్వాత సాయి పల్లవి టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. కనుక ఇద్దరు కలిసి మళ్లీ ఒక సినిమా చేస్తే బాగుంటుందని, జోడీకి మంచి మార్కులు వచ్చాయి కనుక సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అవుతుందని అంతా భావిస్తున్నారు. కానీ ఇద్దరికీ కలిసి నటించే ఛాన్స్ వచ్చినా కూడా నో చెప్పినట్లు స్వయంగా వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్ లో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ మీడియాతో మాట్లాడుతూ సాయి పల్లవితో కలిసి మళ్లీ నటించాలని ఉందని పేర్కొన్నాడు. ఆ మధ్య ఒక కథ వచ్చింది. అయితే తమ నుంచి రాబోతున్న సినిమా ఫిదా ను మించి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మేం విన్న కథ ఫిదాను మించలేదనే ఉద్దేశ్యంతో నో చెప్పాం.

కచ్చితంగా ఇద్దరికి సెట్‌ అయ్యి, ఫిదా ను మించి హిట్ అయ్యే కథ తో వస్తే తప్పకుండా సాయి పల్లవితో కలిసి నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా వరుణ్ తేజ్‌ అన్నాడు. ఫిదా ను మించడం అంటే కాస్త కష్టమే. మరి ఇద్దరినీ మెప్పించే స్థాయి కథ ను ఏ దర్శకుడు రెడీ చేస్తాడో చూడాలి.

ఇంకా వరుణ్ మాట్లాడుతూ.. తనకు మల్టీస్టారర్ సినిమాలు చేయడం పై ఆసక్తి ఉంది. ఆ మధ్య ఒక మల్టీ స్టారర్ కథ నా వద్దకు వచ్చింది. అయితే కథ నచ్చక పోవడంతో నేను ఆ సినిమాను చేయలేదు. భవిష్యత్తులో నితిన్‌ లేదా సాయి తేజ్ లతో మల్టీ స్టారర్ సినిమా చేస్తాను అన్నట్లుగా వరుణ్‌ పేర్కొన్నాడు.