Begin typing your search above and press return to search.

కమ్ముల DNS.. అసలైన మల్టీస్టారర్ షురూ

ఇక ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 6:24 AM GMT
కమ్ముల DNS.. అసలైన మల్టీస్టారర్ షురూ
X

కోలీవుడ్ స్టార్ నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ - కింగ్ నాగార్జున కాంబినేషన్లో ఓ క్రేజీ మల్టీస్టారర్ ఎనౌన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమల ఈ మల్టీ స్టారర్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'#DNS' అనే వర్కింగ్ టైటిల్ తో ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్ గా మొదలైంది. హీరో ధనుష్ తో పాటు సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ రావ్, భరత్ నారంగ్ తదితరులు ఈ మూవీ లాంచింగ్ కి అటెండ్ అయ్యారు. ధనుష్ తో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తూ రెగ్యులర్ షూటింగ్ ను నిన్న ప్రారంభించారు. ఇక ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.


ధనుష్ కెప్టెన్ మిల్లర్, నాగార్జున నా సామిరంగ సినిమాలతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ పై ఆడియన్స్ లో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది.


తమిళ హీరో ధనుష్ తో నాగార్జున మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం, శేఖర్ కమ్ముల ఇలాంటి సెన్సిబుల్ డైరెక్టర్ వీరి మల్టీస్టారర్ ని తెరకెక్కించడం ఇండస్ట్రీవర్గాల్లోనూ సర్వత్ర ఆసక్తికరంగా మారింది.కాగా ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకున్న శేఖర్ కమ్ముల ఈసారి ధనుష్, నాగార్జున వంటి స్టార్స్ తో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసాడు.

ఈ సినిమా కోసం సాలిడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఇక ఈ చిత్ర సాంకేతిక బృంద విషయానికొస్తే.. నికెత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రామకృష్ణ సబ్బని, మౌనిక నిగ్రోతే ప్రొడక్షన్ డిజైనర్స్ వ్యవహరిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.