Begin typing your search above and press return to search.

దిల్ రాజు, సితార.. ప్లానింగే ప్లానింగ్ అబ్బా!

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రూపొందుతున్న ఐదు చిత్రాలని బరిలో దింపుతున్నారు.

By:  Tupaki Desk   |   26 March 2024 1:18 PM GMT
దిల్ రాజు, సితార.. ప్లానింగే ప్లానింగ్ అబ్బా!
X

ఈ రోజుల్లో సినిమా తీయడానికి ఎంతగా కష్టపడాల్సి వస్తోందో, దాన్ని ప్రాపర్ గా రిలీజ్ చెయ్యడానికి కూడా అంతే కష్టపడాల్సి వస్తోంది. ఎంత పర్ఫెక్ట్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని సినిమా కంప్లీట్ చేసినా, సరైన సమయానికి థియేటర్లలోకి తీసుకురావడం మేకర్స్ కు అతిపెద్ద సవాలుగా మారుతోంది. మంచి సీజన్ చూసి డేట్ లాక్ చేసుకున్నా, పోటీలో ఇతర సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ మాత్రం తమ చిత్రాలని సరైన ప్లానింగ్ తో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

ఈసారి సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల విడుదలలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న మేకర్స్.. చిన్నా చితక, మీడియం రేంజ్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దిల్ రాజు, నాగవంశీలు కూడా తమ సినిమాలను లైన్ లో పెట్టారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రూపొందుతున్న ఐదు చిత్రాలని బరిలో దింపుతున్నారు.

సమ్మర్ స్పెషల్ గా ముందుగా ''టిల్లు స్క్వేర్'' సినిమా రిలీజ్ కాబోతోంది. 'డీజే టిల్లు' సీక్వెల్ గా.. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మల్లిక్ రామ్ దీనికి దర్శకడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదే బ్యానర్ లో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాని కూడా వేసవి కాలంలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావ''. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికింది. మే 17న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీ కంటే ముందే దిల్ రాజు బ్యానర్ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే ఇదే బ్యానర్ లో ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'లవ్ మీ'. ఈ హారర్ లవ్ స్టోరీని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో సుహాస్ హీరోగా నటిస్తోన్న ఇంకా పేరు పెట్టని చిత్రాన్ని కూడా మే 3న రిలీజ్ చేయనున్నారు.

ఇలా వేసవిలో రెండు నెలల కాలంలో కేవలం ఈ రెండు నిర్మాణ సంస్థల నుంచే 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా, థియేటర్ల సమస్య తలెత్తకుండా.. వారం వారం గ్యాప్ ఇచ్చి ఈ రిలీజులు ప్లాన్ చేయబడ్డాయి. మేకర్స్ కంట్రోల్ లో లేని ఎన్నో పరిస్థితులు సినిమాపై ప్రభావం చూపిస్తున్న రోజుల్లో.. ఎలాంటి అడ్డంకులు లేకుండా, పోటీ లేకుండా సమ్మర్ సీజన్ లో సాఫీగా సినిమాలు విడుదల అవ్వడం మంచి విషయమనే చెప్పాలి. కాకపోతే దిల్ రాజు, నాగవంశీల మాదిరిగా అందరికీ ఇలాంటి డేట్లు దొరుకుతాయా అంటే చెప్పడం కష్టమే అవుతుంది.