సితార బ్యానర్ లో మరో బ్లాక్ బస్టర్ కాంబో
ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ టాలీవుడ్, కోలీవుడ్లో మంచి హిట్ అందించిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ‘వాతి’ (తెలుగులో ‘సర్’) సినిమా రూ. 100 కోట్ల గ్రాస్తో బ్లాక్బస్టర్గా నిలిచింది.
By: Tupaki Desk | 2 Jun 2025 12:04 PM ISTధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ టాలీవుడ్, కోలీవుడ్లో మంచి హిట్ అందించిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ‘వాతి’ (తెలుగులో ‘సర్’) సినిమా రూ. 100 కోట్ల గ్రాస్తో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఎడ్యుకేషన్ మాఫియా నేపథ్యంలో సాగే సందేశాత్మక కథతో అభిమానులను ఆకర్షించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభను, ధనుష్ నటనను మరోసారి చాటింది.
అయితే ఈ కాంబో మరోసారి కలవనుందని తాజా వార్తలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వెంకీ అట్లూరి ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో దుల్కర్ సల్మాన్తో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రూ. 110 కోట్ల గ్రాస్తో విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన సూర్యతో ‘సూర్య 46’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మే 2025లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా, సమ్మర్ 2026లో విడుదల కానుంది.
ఈ ప్రాజెక్ట్లో మమిత బైజు, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పీరియడ్ డ్రామాగా సాగుతుందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ‘సూర్య 46’ పూర్తయిన తర్వాత వెంకీ అట్లూరి మరోసారి ధనుష్తో చేతులు కలపనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందే ఈ కొత్త సినిమా ‘హనెస్ట్ రాజ్’ అనే టైటిల్తో తెరకెక్కనుందని టాక్.
ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా, ఎమోషనల్ ఎలిమెంట్స్తో రూపొందనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘వాతి’ సక్సెస్ తర్వాత ధనుష్, వెంకీ అట్లూరి కలిసి మరో హిట్ ఇస్తారని ఆశిస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం ‘నీక్’, ‘ఇడ్లీ కడై’, ‘కుబేర’ సినిమాలతో బిజీగా ఉన్నాడు, వెట్రి మారన్, రాజ్కుమార్ పెరియసామి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వెంకీతో మరో సినిమా అభిమానులకు పండగలా ఉంటుందని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాగ వంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి వరుస హిట్స్తో దూసుకెళ్తున్నాడు, ఈ కొత్త సినిమా కూడా ఆ సక్సెస్ ట్రాక్ను కొనసాగిస్తుందని ఆశిస్తున్నారు. ఇక ‘సూర్య 46’ తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
