ధనుష్ టాలీవుడ్ బాక్సాఫీస్.. లెక్క ఏ రేంజ్ లో పెరిగిందంటే..
ఈ నేపథ్యంలో అతని గత ఆరు చిత్రాల తెలుగులో వచ్చిన కలెక్షన్లు విశ్లేషించుకుంటే ఆసక్తికరంగా మారుతోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 6:55 PM ISTతమిళ నటుడు ధనుష్ తన కెరీర్ను విభిన్న జానర్లతో నిర్మించుకుంటూ సౌత్ ఇండియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తాను నటించే ప్రతి సినిమాలోనూ నటనకు న్యాయం చేస్తూ, ఒక్కోసారి కథల ఎంపికలో ఆశ్చర్యపరుస్తుంటాడు. తమిళనాట ఆయనకు వన్ మ్యాన్ ఆర్మీలా ఫాలోయింగ్ ఉన్నా, తెలుగులో మాత్రం గతం వరకు అతని మార్కెట్ పరిమితంగానే ఉండేది.
అయితే ‘సార్’ అనే సినిమా ద్వారా ఆ దశ పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రం టాలీవుడ్లో మంచి హిట్ కావటంతో ధనుష్ మీద తెలుగు మేకర్స్ దృష్టి పడింది. ఆ క్రేజ్ను సద్వినియోగం చేసుకుంటూ తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర' చిత్రం మరో హిట్గా నిలిచింది. కేవలం నాలుగు రోజుల్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించటం ఇందుకు నిదర్శనం. ఈ జోరుతో ధనుష్ వరుసగా తెలుగు మార్కెట్లో తన స్థానాన్ని బలపరుచుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో అతని గత ఆరు చిత్రాల తెలుగులో వచ్చిన కలెక్షన్లు విశ్లేషించుకుంటే ఆసక్తికరంగా మారుతోంది. కొన్నింటిలో బోల్తా పడినప్పటికీ, ‘వాతి’ ‘కుబేర’ సినిమాలు టాలీవుడ్లో భారీ స్థాయిలో వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా ‘క్యాప్టెన్ మిల్లర్’, ‘నానే వరువెన్’, ‘తిరుచిత్రంబలం’ వంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, అవి ధనుష్ కు కాంటెంట్ పరంగా స్పెషల్ ప్రాజెక్టులుగా నిలిచాయి.
ధనుష్ తెలుగు మార్కెట్ గ్రాస్ లెక్కలు
కుబేర - 40.50 కోట్లు (4 రోజులు)*
రాయన్ - 15.90 కోట్లు
క్యాప్టెన్ మిల్లర్ - 2.20 కోట్లు
వాతి - 41.25 కోట్లు
నానే వరువెన్ - 1.30 కోట్లు
తిరుచిత్రంబలం - 3.00 కోట్లు
ఇప్పుడు ఈ గణాంకాల ఆధారంగా టాలీవుడ్ మేకర్స్ ధనుష్ను మరో కమర్షియల్ హీరోగా పరిగణిస్తూ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు. వెంకీ అట్లూరితో మరో సినిమా కమిట్ అవడం విశేషం. ఒక తమిళ హీరో తెలుగులో ఈ స్థాయిలో వరుసగా కలెక్షన్లను కొల్లగొట్టడం చాలా అరుదైన విషయమే. మార్కెట్ను బలోపేతం చేయడంలో ధనుష్ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడని చెప్పాలి. ఇక రాబోయే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.