Begin typing your search above and press return to search.

దేవరపై జాన్వీ పాప హింట్.. ఎంతవరకు వచ్చిందంటే..

రీసెంట్ గా హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 9:37 AM GMT
దేవరపై జాన్వీ పాప హింట్.. ఎంతవరకు వచ్చిందంటే..
X

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ కెరీర్ మలుపు తిరిగే దశ ప్రారంభమైంది. ఆమె జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమ్మడికి చాలా ప్రత్యేకమైనదే. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు దేవరతో ఆమె అందుకునే ఫలితం మరొక లెక్క అనే విధంగా ఉంది.

ఎందుకంటే ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా రూపొందుతోంది. దర్శకుడు కొరటాల శివ మునుపెన్నడు లేని గ్రాంథియర్ కథను ఈ సినిమాలో చూపించబోతున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో మళ్ళీ ఇటీవల బ్రేకులు పడ్డాయి.

సినిమాను మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే హఠాత్తుగా మళ్ళీ మధ్యలో బ్రేకులు పడ్డాయి. అంతేకాకుండా సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. అతను నెలరోజుల వరకు రెస్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు సైఫ్ వచ్చిన తర్వాత షూట్ చేయబోతున్నారు. ఇక సినిమాను అక్టోబర్ 10 న రిలీజ్ చేయనున్నట్లు మరో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక సినిమా ఎంత ఫినిష్ అయిందన్న విషయంలో మాత్రం చిత్ర నిర్మాత దర్శకుడు ఎవరు కూడా పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. రీసెంట్ గా హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది. సినిమా షూటింగ్ కొనసాగుతోంది అని అలాగే సినిమాలోని సాంగ్స్ కూడా షూటింగ్ చేయాల్సి ఉంది అని వివరణ ఇచ్చింది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండబోతున్నట్లుగా ఇదివరకే టాక్ వినిపించిన విషయం తెలిసిందే. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

సాంగ్స్ కంపోజ్ చేయడం ఫినిష్ అయ్యిందట. ఇక సాంగ్స్ ను షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ తనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది అని నా పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుంది అని జాన్వీ తెలియజేసింది. అంతేకాకుండా ప్రతి సీన్ కూడా ప్రత్యేకంగా ఉండాలి అని షూటింగ్ ఒక రోజు ముందే ప్రతి సన్నివేశం గురించి చదివి మరి తెలుసుకుంటున్నట్లుగా ఆమె తెలియజేసింది. మరి ఈ సినిమాతో జాన్వీ కపూర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.