Begin typing your search above and press return to search.

మెగా 'విశ్వంభర' తర్వాత ప్రయాణం..!

ఇటీవలే రామోజీ ఫిల్మ్‌ సిటీలోని షెడ్యూల్‌ ను ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఊటీకి షిఫ్ట్‌ అవ్వబోతున్నారు

By:  Tupaki Desk   |   25 March 2024 10:32 AM GMT
మెగా విశ్వంభర తర్వాత ప్రయాణం..!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా షూటింగ్ మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన విషయం తెల్సిందే. అక్కడ పాట చిత్రీకరణతో పాటు బురదలో ఒక భారీ యాక్షన్ సన్నివేశంను చిత్రీకరించారు.

ఇటీవలే రామోజీ ఫిల్మ్‌ సిటీలోని షెడ్యూల్‌ ను ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఊటీకి షిఫ్ట్‌ అవ్వబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు ఇతర ప్రొడక్షన్ టీం ఊటీ చేరుకుని సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా తదుపరి షెడ్యూల్‌ ఊటీ లో జరగబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఊటీలో చిరంజీవి మరియు త్రిష పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండబోతుందట.

ఊటీ లో మరో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు గా సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత లు నటిస్తున్నారు. కీరవాణి ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విశ్వంభర విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.