Begin typing your search above and press return to search.

మ‌త్స‌కారుల జీవితాల్లోకి చైత‌న్య‌-చందు మొండేటి!

నాగ‌చైత‌న్య‌..చందు మొండేటి..బ‌న్నీ వాస్ ముగ్గురు ఉత్త‌రాంధ్ర మ‌త్స‌కారుల జీవ‌న విధానాన్ని తెలుసు కునేందుకు బ‌య‌ల్దేరిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 9:16 AM GMT
మ‌త్స‌కారుల జీవితాల్లోకి చైత‌న్య‌-చందు మొండేటి!
X

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి రంగం సిద్ద‌మ వుతోన్న సంగ‌తి తెలిసిందే. జీఏ-2 బ్యాన‌ర్ పై బ‌న్నీవాస్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ త్ర‌యంలో సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌నైతే వ‌చ్చిందిగానీ..అదే స్టేజ్ లో ఉందో? క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ చిత్రం ఓ మ‌త్స‌కారుడి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ట్లు స‌మాచారం. స‌ముద్ర తీర ప్రాంతంలో నివ‌సించే వాళ్ల జీవితాలు..చ‌రిత్ర‌ని చిత్ర బృందం తెలుసుకున్న‌ట్లు తెలుస్తోంది.

నాగ‌చైత‌న్య‌..చందు మొండేటి..బ‌న్నీ వాస్ ముగ్గురు ఉత్త‌రాంధ్ర మ‌త్స‌కారుల జీవ‌న విధానాన్ని తెలుసు కునేందుకు బ‌య‌ల్దేరిన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా నాగ‌చైత‌న్య ఏకంగా ఏపీ బోర్డ‌ర్ శ్రీకాకుళం జిల్లాకే చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్క‌డ నుంచి అన్ని తీర ప్రాంత జిల్లాల్ని ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం సిక్కోలు జిల్లాలోని ప‌లు మ‌త్స‌కార గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

వారి జీవిన విధానం ఇప్పుడు ఎలా ఉంది? ఒక‌ప్పుడు ఎలా ఉండేది? కాల క్ర‌మం లో ఎలాంటి మార్పులొచ్చాయి? త‌రాలు మారే కొద్దే వ‌చ్చే మార్పుల్లో వ్య‌త్యాసాల్ని స్ప‌ష్టంగా గ‌మ‌నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌ముద్రం మ‌ధ్య భాగం లో అక‌స్మాతుగా తుఫాన్ లు వ‌స్తే ఎలా ఉంటుంది? పొరపాటున స‌రిహ‌ద్దులు దాటి పాక్ జ‌లాల్లోకి ప్ర‌వేశిస్తే? ప‌రిస్థితి ఏంటి? అరెస్ట్ అయి జైలులో మ‌గ్గిన జీవితాలు ఎలా ముగిసాయి? వంటి ఆస‌క్తిక‌ర అంశాలెన్నింటిపైనో యూనిట్ జ‌ల్లెడ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

కొన్ని నెల‌ల క్రితం బ‌న్నీ వాస్ కూడా వైజాగ్ మ‌త్స‌కారుల్ని క‌లిసారు. అక్క‌డ లోక‌ల్ బోయ్ నానితో వాళ్ల జీవిన విధానాన్ని అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసాడు. అత‌నితో స‌ముద్రంలో బోట్ పై లాంగ్ డ్రైవ్ కి వెళ్లాడు. బ‌న్నీ వాస్ ఈ ప‌ని కొన్ని నెల‌ల ముందే చేసాడు. దీని వెనుక సినిమా క‌థ ఉంద‌ని అర్ధ‌మ వుతోంది. మొత్తానికి చైత‌న్య సినిమా పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది.

పాన్ ఇండియాకి క‌నెక్ట్ అయ్యే అంశ‌మే మిది. ప‌రిశోధ‌న‌లు..ప‌ర్య‌ట‌న‌లు...త‌ర్పీదులు ఇలా తెర వెనుక చాలా త‌తంగ‌మే ఉంటుంది. క‌థ బ‌లంగా ఉండాల‌న్నా..అందులో పాత్ర‌లు అంతే బ‌లంగా క‌నిపించాల‌న్నా ఇలాంటి ప‌రిశోధ‌నలు త‌ప్ప‌నిస‌రి. అందులోనూ చందు మొండేటి మ‌రింత డీప్ గా ఎనాల‌సిస్ చేసే మేక‌ర్. అందుకే త‌న‌తో పాటు చైత‌న్య‌ని కూడా రంగంలోకి దించిన‌ట్లు తెలుస్తోంది. 'కార్తికేయ‌-2' త‌ర్వాత చందు మొండేటి తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో అంచాన‌లు భారీగా ఉన్నాయి.