Begin typing your search above and press return to search.

ఎంటి బ్రో ఇలా షాకిచ్చావ్..!

కాగా, తాజాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ చాలా తక్కువ అట.

By:  Tupaki Desk   |   16 July 2023 9:41 AM GMT
ఎంటి బ్రో ఇలా షాకిచ్చావ్..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవన్ లుక్ ఫ్యాన్స్ కి మరింత ఎక్కువ కిక్ ఇచ్చింది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ తదితర పనులు జరుగుతున్నాయి.

కాగా, తాజాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ చాలా తక్కువ అట. కేవలం 130 నిమిషాలతోనే సినిమాను పూర్తి చేశారని తెలుస్తోంది. అంటే రెండు గంటల 10 నిమిషాల్లోనే సినిమా ముగుస్తుంది. నిజానికి స్టార్ హీరోల సినిమాలు అంటే కనీసం రెండున్నర గంటలకు పైగా రన్ టైం ఉండేలా ప్లాన్ చేస్తారు. కానీ, ఈ మూవీ రన్ టైమ్ తక్కువగా ఉందని వార్త రావడంతో ఫ్యాన్స్ షాకౌతున్నారు.

సినిమా తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుందని, దాని వల్ల ఎక్కువ మంది అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారట. దీనిపై ఇఫ్పటి వరకు అధికారిక ప్రటకన మాత్రం రాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కొన్నిసార్లు రన్ టైమ్ అనేది తక్కువ ఉంటే మంచిదే కానీ ఇలాంటి పెద్ద సినిమాకు మాత్రం కాస్త రిస్క్ తో కూడకున్న పని. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఇక ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్రో సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ రేట్స్ ని భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ హక్కులను జీ తెలుగు సంస్థ రూ. 20 కోట్లకు సొంతం చేసుకుందట. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కి రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే, పవన్, తేజ్ ఈమేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేశారు ఈ మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.