Begin typing your search above and press return to search.

మెగా రీమేక్ లో అసలు పాయింట్ మారిందట

మలయాళంలో మోహన్‌ లాల్‌ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నిలిచింది

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:33 AM GMT
మెగా రీమేక్ లో అసలు పాయింట్ మారిందట
X

'భోళాశంకర్'తో రిలీజ్ కు రెడీ అయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్‌ కృష్ణ కురసాల ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ 'బ్రో డాడీ'కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. తాజాగా ఈ రీమేక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మలయాళంలో మోహన్‌ లాల్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నిలిచింది. అలానే మంచి వసూళ్లను అందుకుంది. అయితే రీమేక్ వెర్షన్ లో నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారట. మాతృక కథలో మోహన్‌ లాల్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తండ్రీ కొడుకులుగా నటించి ఆకట్టుకున్నారు.

అయితే తెలుగు రీమేక్ లో మాత్రం తండ్రీకొడుకుల థీమ్‌ చూపించట్లేదని తెలిసింది. బ్రదర్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందించేలా పాత్రలను డిజైన్ చేస్తున్నారని సమాచారం అందింది. అయితే ఆ మధ్య చిరంజీవితో పాటు డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నల్లగడ్డ పేరు వినిపించింది. అయితే ఇప్పుడా స్థానంలోకి యంగ్ హీరో శర్వానంద్‌ మరో కనిపించబోతున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

చిరుకు సోదరుడిగా శర్వానంద్ కనిపించనున్నారట. అయితే ఈ సినిమాపై ఇప్పటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ నెలలో మూవీ గురించి అధికారిక ప్రకటన చేసి.. నటీనటులు వివరాలను తెలియజేస్తారని తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు బ్యో డాడీ కాదూ కేవలం బ్రో మాత్రమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నట్లు సమాచారం.

'బ్రో డాడీ' రీమేక్‌ రైట్స్‌ ను చిరజీవి కూతురు సుస్మిత కొణిదెల కొనుగోలు చేసింది. హోం బ్యానర్‌ గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిరు మెహర్ రమేశ్‌ డైరెక్షన్‌లో 'భోళాశంకర్‌'తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'వేదాళం' రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.