#AAA సినిమాలో మరో స్టార్...!
అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీని చాలా స్పీడ్గా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.
By: Tupaki Desk | 5 May 2025 8:46 AMఅల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటి అంటూ మొన్నటి వరకు అభిమానులతో పాటు, ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్తో బన్నీ సినిమా ఉంటుందని భావించిన వారికి షాక్ ఇస్తూ అట్లీని రంగంలోకి దించారు. తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లో అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. టాలీవుడ్లోనే కాకుండా ఇతర ఏ భాషల్లోనూ ఇప్పటి వరకు ఏ సినిమాను నిర్మించని స్థాయిలో భారీ బడ్జెట్తో బన్నీ, అట్లీ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఇటీవలే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీని చాలా స్పీడ్గా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ టీం వర్క్ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన చర్చలు జరిగిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా కోసం టెస్ట్ షూట్ చేసిన మేకర్స్ చాలా సంతృప్తిగా ఉన్నారని సమాచారం అందుతోంది.
సినీ వర్గాల నుంచి అందుతున్న కొత్త సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. బాలీవుడ్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక పాత్రను బాలీవుడ్ హీరో కోసం డిజైన్ చేశారని తెలుస్తోంది. ఆ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్లో జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల వసూళ్లను అట్లీ అందుకున్నాడు. అందుకే ఏ బాలీవుడ్ హీరో అయినా అట్లీ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడిని ఈ సినిమాలో నటింపజేయడం ద్వారా అక్కడ కూడా మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. కొత్తగా కియారా అద్వానీ హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పలువురి హీరోయిన్స్ పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం జరుగుతున్నాయని తెలుస్తోంది, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్ను ట్రై చేస్తున్నాడు. అందుకోసం ప్రముఖ ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ ప్రారంభించాడు.