Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : విశ్వంభర సెట్స్ లో మరో గెస్ట్‌

ఎవరు ఔనన్నా కాదన్నా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   20 April 2024 6:53 AM GMT
పిక్ టాక్‌ : విశ్వంభర సెట్స్ లో మరో గెస్ట్‌
X

ఎవరు ఔనన్నా కాదన్నా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అనడంలో సందేహం లేదు. అలాంటి చిరంజీవి ఇంటి వద్ద ఉన్నా, షూటింగ్‌ లో ఉన్నా ప్రతి రోజూ ఎవరో ఒకరు ఇండస్ట్రీకి చెందిన వారు కలుస్తూనే ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌ కోసం సెట్స్ లో ఉన్న విషయం తెల్సిందే.


చిరంజీవి ని కలిసేందుకు, ఆయన ఆశీర్వాదం కోసం అంటూ ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారే విశ్వంభర సెట్స్ కు వెళ్తున్నారు. ఇటీవల పలువురు చిరంజీవి ని విశ్వంభర సెట్స్ లో కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా విశ్వంభర సెట్స్ లోనే చిరు ను కలవడం జరిగింది.

ఇప్పుడు యంగ్‌ హీరో కార్తికేయ కూడా చిరంజీవిని విశ్వంభర సెట్స్ లో కలిశాడు. కార్తికేయ హీరోగా ప్రశాంత్‌ రెడ్డి చందారపు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'భజే వాయు వేగం'. ఈ సినిమా విశేషాలను తెలియజేసి టీజర్ ను చిరంజీవి తో విడుదల చేయించేందుకు కార్తికేయ కలవడం జరిగింది.

విశ్వంభర సెట్స్ లో షూటింగ్‌ గ్యాప్‌ లో కార్తికేయను చిరంజీవి కలిసి ఆప్యాయంగా మాట్లాడిన ఫోటోలు బయటకు వచ్చాయి. విశ్వంభర సెట్స్ లో ఉన్న ఆంజనేయుని విగ్రహం వద్దే చిరు మరియు కార్తికేయలు ఫోటోలు దిగి వాటిని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు.

బాస్ ఫర్‌ భజే వాయు వేగం అంటూ టీజర్ లాంచ్ పోస్టర్ ను కార్తికేయ తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా షేర్ చేశాడు. నేడు మధ్యాహ్నం 2.25 గంటలకు టీజర్ ను చిరంజీవి విడుదల చేయబోతున్నారు. చిరంజీవి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవుతున్న నేపథ్యంలో భజే వాయు వేగం సినిమాకు మంచి రీచ్ దక్కే అవకాశం ఉంది.