Begin typing your search above and press return to search.

నీకు అండగా ఉంటాను బాబాయ్, లవ్ యూ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న ‘భైరవం’ సినిమా టాలీవుడ్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   19 May 2025 1:22 PM IST
నీకు అండగా ఉంటాను బాబాయ్, లవ్ యూ
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న ‘భైరవం’ సినిమా టాలీవుడ్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో, కెకె రాధామోహన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 30న విడుదల కానుంది. తమిళ హిట్ ‘గరుడన్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఏలూరులో ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో మంచు మనోజ్ భావోద్వేగ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది, నారా రోహిత్ తన స్పందనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

‘భైరవం’ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామాతో అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ‘నాంది’, ‘ఉగ్రం’ సినిమాలతో సత్తా చాటిన విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో మరో హిట్ అవుతుందని అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్‌లో మనోజ్ తన కుటుంబ సమస్యలను ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యాడు.

మనోజ్ మాట్లాడుతూ, “సొంత వాళ్లు దూరం పెట్టిన ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకుని ఇంత ప్రేమను చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డుపైకి తెచ్చారు” అని భావోద్వేగంగా అన్నాడు. తాను ఎప్పటికీ మోహన్ బాబు కుమారుడినేనని, కట్టె కాలే వరకు ఆయన కొడుకుగానే ఉంటానని చెప్పాడు. ఈ స్పీచ్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది, అభిమానులను కంటతడి పెట్టించింది.

ఈ ఈవెంట్ తర్వాత నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “ఏలూరులో ‘భైరవం’ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఈవెంట్‌ను ప్రత్యేకం చేసిన ఏలూరు ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్‌లో మనోజ్ బాబాయ్ స్పీచ్ హైలైట్, ఎంతో పవర్‌ఫుల్‌గా, భావోద్వేగంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఏది ఏమైనా నీకు అండగా ఉంటాను బాబాయ్, లవ్ యూ” అని రోహిత్ రాశాడు.

రోహిత్ ఈవెంట్‌లో ‘భైరవం’ గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా నా కెరీర్‌లో స్పెషల్. బెల్లంకొండ సురేశ్ ఈ కథను తీసుకొచ్చారు, విజయ్ కనకమేడల డైరెక్షన్‌తో నమ్మకం కలిగింది. సాయి, మనోజ్ నటిస్తున్నారని తెలిసి సంతోషించాను. మనోజ్‌తో చిన్నప్పటి నుంచి సన్నిహిత అనుబంధం ఉంది, ఈ సినిమాతో మా బంధం మరింత బలపడింది” అని అన్నాడు. మొత్తంగా, ‘భైరవం’ ట్రైలర్ ఈవెంట్ అభిమానులకు ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచింది. మనోజ్, రోహిత్ మధ్య అనుబంధం, ఈ సినిమా హైప్‌ను మరింత పెంచింది. మే 30న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.