భైరవం కోసం రంగంలోకి నలభీములు!
ఇప్పటికే ప్రమోషన్స్ని ప్రారంభించిన టీమ్ తాజాగా మరో వీడియోని విడుదల చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 13 May 2025 9:29 AMబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నభారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `భైరవం`. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని కీలక పాత్రల్లో మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన విషయం తెలిసిందే. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై నటించారు. చాలా రోజులుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నామంటూ టీమ్ ప్రకటించింది.
ఆ రోజు రావాల్సిన హరి హర వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ రావడం లేదని వార్తలు షికారు చేయడంతో ఆ డేట్ని బెల్లంకొండ శ్రీనివాస్ `భైరవం`కు లాక్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ని ప్రారంభించిన టీమ్ తాజాగా మరో వీడియోని విడుదల చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ మూవీలోని కీలక పాత్రల్లో నటిస్తున్న మంచు మనోజ్, నారా రోహిత్ ఈ మూవీ టీమ్ కోసం సెట్లో గరిట పట్టి నలభీములయ్యారు. గరిటపట్టి సందడి చేశారు.
టీమ్ కోసం ప్రత్యేకంగా గరిట తిప్పి ఈ ఇద్దరు హీరోలు వంట చేశారు. తమదైన వంటలతో టీమ్కు పసందైన వంటకాలను రుచి చూపించారు. ఈ మూవీ కోసం సెకండ్ హాఫ్లో దర్శకుడు విజయ్ కనకమేడల భారీ యాక్షన్ బ్లాక్ని ప్లాన్ చేశాడట. దీన్ని మొదలు పెట్టిన రెండు రోజులకే మంచు మనోజ్, నారా రోహిత్ ఇద్దరూ దర్శకుడు విజయ్ కనకమేడలకు షాక్ ఇచ్చారట. మీరు షాట్కు బ్రేక్ ఇవ్వడం లేదు. దీంతో మేము సరైన ఫుడ్ కూడా తినలేకపోతున్నాం. అందుకే ఈ రోజు లొకేషన్లో మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి టైమ్కు మీకు పెడతాం అన్నారట. చెప్పినట్టే షూటింగ్ చేస్తూనే మరో పక్క షాట్ గ్యాప్లోవంట ప్రిపేర్ చేస్తూ చాలా సరదాగా గడిపారట.
తమదైన శైలి వంటలతో యూనిట్ మొత్తానికి వండి వార్చారట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ల కెరీర్కు కీలకంగా మారింది. దీంతో ఈ నెల 30న రిలీజ్కానున్న ఈ మూవీపై ఈ ముగ్గరు హీరోలు భారీ అంచనాలు పెట్టుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు.