అంచనాలకు మించి భైరవం: బెల్లంకొండ
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 4:55 AMటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళం హిట్ మూవీ గరుడన్ కు రీమేక్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టు రూపొందించారు.
అయితే మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. మూవీ వర్కౌట్ అవుతుందనే ఫీలింగ్ అందరిలో క్రియేట్ అవుతోంది. అదే సమయంలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో.. సినిమా ఆడియన్స్ అంచనాలకు మించి ఉంటుందని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు.
ఇప్పుడు ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశామని, సినిమాలో అందులో చూసిన దానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అందరినీ సినిమా తప్పకుండా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంత అద్భుతమైన మూవీ తమకు ఇచ్చినందుకు డైరెక్టర్ విజయ్ కనకమేడలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సినిమాల్లో నాంది, ఉగ్రం తనకు ఇష్టమని చెప్పారు.
భైరవం మూవీలో స్ట్రాంగ్ ఎమోషన్స్ తో పాటు రిచ్ మేకింగ్ ఉందని పేర్కొన్నారు. ఆ సినిమాతో విజయ్.. స్టార్ డైరెక్టర్స్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భైరవం మూవీలో నటీనటుల ఎంపిక కీలక పాత్ర పోషించిందని, నారా రోహిత్ తమతో నటించడం గొప్పగా అనిపించిందని, అదొక సక్సెస్ మామొంట్ గా వర్ణించారు బెల్లంకొండ శ్రీనివాస్.
ఆయన తమ టీమ్ తో కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అదే సమయంలో మంచు మనోజ్ ను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. ఆయన వర్క్ కు పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అసాధారణమైన ప్రదర్శనలు ఇచ్చారని, భైరవంలో నటించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మా ముగ్గురికి భైరవం కమ్ బ్యాక్ ఇస్తుందని చెప్పారు.
మరోవైపు, భైరవం తన కెరీర్ లో స్పెషల్ మూవీ అని తెలిపారు నారా రోహిత్. ఆ ప్రాజెక్ట్ ను తన దగ్గరకు తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. సినిమాలో సాయి, మనోజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారని తెలిసి సంతోషంగా అనిపించిందని చెప్పారు. నిర్మాత రాధామోహన్ గారు స్క్రిప్ట్ పై నమ్మకం ఉంటే సినిమాను హృదయపూర్వకంగా ఆదరిస్తారని, తాను దానిని చాలా గౌరవిస్తానని పేర్కొన్నారు.