అవికా గోర్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. డేట్ చెప్పేసిన హీరోయిన్!
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యి ప్రేక్షకుల మనసును గెలిచింది అవికా గోర్.
By: Madhu Reddy | 22 Sept 2025 2:48 PM IST'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యి ప్రేక్షకుల మనసును గెలిచింది అవికా గోర్. అలా సీరియల్ తర్వాత 'ఉయ్యాల జంపాల' సినిమాతో ఏకంగా హీరోయిన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అటు రాజ్ తరుణ్ కి ఇటు అవికా గోర్ కెరీర్ కి పెద్ద ప్లస్ అయింది. అలా ఈ సినిమాకి వచ్చిన గుర్తింపుతో అవికా గోర్ వెంటనే లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది-3, పాప్ కార్న్, ఉమాపతి వంటి సినిమాల్లో నటించింది. అలా సినిమాల్లో వచ్చిన గుర్తింపుతో పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. మరి ఈ హీరోయిన్ పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అవికా గోర్ గత కొద్ది సంవత్సరాల నుండి సామాజిక కార్యకర్త అయినటువంటి మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన డేట్ ని ప్రకటించింది అవికా గోర్. తాజాగా ఆ ఇంటర్వ్యూలో అవికా మాట్లాడుతూ.."మేమిద్దరం సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నాం" అంటూ ప్రకటించింది.
అంతేకాదు నాకు ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇస్తూ అన్నివేళలా నాతో ఉండే భాగస్వామిని పొందినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.నేను ఓ అదృష్టవంతుడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ అవికా గోర్ చెప్పుకొచ్చింది. అవికా గోర్ తన పెళ్లి డేట్ ని ప్రకటించిన సమయంలో అక్కడే ఉన్న అవికా గోర్ తల్లి కాస్త ఎమోషనల్ అయింది. అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ.." 2008 నుండి నేను ప్రేక్షకులు గుర్తించదగ్గ స్టేజ్ లో ఉన్నాను.నా సినీ కెరీర్ లో ప్రేక్షకులు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. వాళ్లు కూడా నా ఈ వివాహ బంధంలో భాగం కావాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెప్పాను. అలాగే చిన్నతనంలో నేను నా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు ఈ కొత్త అధ్యాయంతో నా చిన్ననాటి కల నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది".. అంటూ అవికా గోర్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం అవికా గోర్ తన పెళ్లికి సంబంధించిన డేట్ ప్రకటించడంతో చాలామంది అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక అవికా గోర్ మిలింద్ ఇద్దరు 2020లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. అప్పటి నుండి వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ప్రేమకి దారి తీసి.. పెళ్ళి వరకు వెళ్ళింది. మరోవైపు అవికా గోర్ నటించిన పతి పత్ని పంగా అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల కాబోతోంది.
