Begin typing your search above and press return to search.
'రైటర్ పద్మభూషణ్' మేకర్స్ డేరింగ్ స్టెప్
By: Tupaki Desk | 27 Jan 2023 4:04 PM GMTఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఎన్ని ఆడుతున్నాయో ఎన్ని జనాల్లోకి వెళుతున్నాయో అందరికీ తెలిసిందే. పది రిలీజ్ అయితే అందులో రెండు మాత్రమే జనాలని ఆకట్టుకుంటున్నాయి. వారి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇందు కోసం మేకర్స్ పెదద యుద్దమే చేయాల్సి వస్తోంది. ఓ సినిమాని నిర్మించడానికి ఎంత పెద్ద కసరత్తు చేస్తున్నారో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి కూడా అంతే స్థాయిలో కసరత్తు చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ యంగ్ టీమ్ తాము నిర్మించిన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింటి. 'కలర్ ఫొటో' ఫేమ్ సుహాస్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'రైటర్ పద్మభూషణ్'.
సుహాస్ తో షార్ట్ ఫిలింస్ నిర్మించడమే కాకుండా ఇటీవల సూపర్స్టార్ మహేష్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంలో 'మేజర్' మూవీని నిర్మించిన శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి మరో వ్యక్తి చంద్రు మనోహరన్ తో కలిసి ఈ 'రైటర్ పద్మభూషణ్'ని ఛాయ్ బిస్కెట్ సినిమాస్, లహరి ఫిలింస్ బ్యానర్ ల పై నిర్మించారు.
శణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకురన్న సుహాస్ 'కలర్ ఫొటో'తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తను హీరో అంటే సినిమా కోసం ఆడియన్స్ థియేటర్లకి వస్తారా? అనే అనుమానం సహజమే. అందుకే ఈ మూవీ కోసం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కోసం మేకర్స్ వినూత్న ప్రయత్నానికి తెర లేపారు.
ఏదైనా సినిమా రిలీజ్ అవుతోందంటే ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం సహజం. అయితే 'రైటర్ పద్మభూషణ్' కు కోసం ఆ ఫార్ములాని బ్రేక్ చేస్తూ మేకర్స్ ఏకంగా ఐదు సిటీస్ లలో ఫ్యామిలీస్ కోసం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక ప్రీమియర్ షోలని ఏర్పాటు చేశారు. 27న విజయవాడలో, 28న గుంటూరులో, 29న భీమవరంలో, 30న కాకినాడలో, 31న వైజాగ్ లో, ఫిబ్రవరి 1న హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఫ్యామిలీస్ కోసం షోలు వేస్తున్నారు.
దీంతో 'రైటర్ పద్మభూషణ్' హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ కాన్ఫిడెన్స్ కి తగ్గట్టుగా ఫ్యామిలీస్ నుంచి రెస్పాన్స్ లభిస్తే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అనిపించుకోవడం గ్యారెంటీ అఏ కామెంట్ లు వినిపిస్తున్నాయి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఈ నేపథ్యంలో ఓ యంగ్ టీమ్ తాము నిర్మించిన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింటి. 'కలర్ ఫొటో' ఫేమ్ సుహాస్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'రైటర్ పద్మభూషణ్'.
సుహాస్ తో షార్ట్ ఫిలింస్ నిర్మించడమే కాకుండా ఇటీవల సూపర్స్టార్ మహేష్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంలో 'మేజర్' మూవీని నిర్మించిన శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి మరో వ్యక్తి చంద్రు మనోహరన్ తో కలిసి ఈ 'రైటర్ పద్మభూషణ్'ని ఛాయ్ బిస్కెట్ సినిమాస్, లహరి ఫిలింస్ బ్యానర్ ల పై నిర్మించారు.
శణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకురన్న సుహాస్ 'కలర్ ఫొటో'తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తను హీరో అంటే సినిమా కోసం ఆడియన్స్ థియేటర్లకి వస్తారా? అనే అనుమానం సహజమే. అందుకే ఈ మూవీ కోసం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కోసం మేకర్స్ వినూత్న ప్రయత్నానికి తెర లేపారు.
ఏదైనా సినిమా రిలీజ్ అవుతోందంటే ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం సహజం. అయితే 'రైటర్ పద్మభూషణ్' కు కోసం ఆ ఫార్ములాని బ్రేక్ చేస్తూ మేకర్స్ ఏకంగా ఐదు సిటీస్ లలో ఫ్యామిలీస్ కోసం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక ప్రీమియర్ షోలని ఏర్పాటు చేశారు. 27న విజయవాడలో, 28న గుంటూరులో, 29న భీమవరంలో, 30న కాకినాడలో, 31న వైజాగ్ లో, ఫిబ్రవరి 1న హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఫ్యామిలీస్ కోసం షోలు వేస్తున్నారు.
దీంతో 'రైటర్ పద్మభూషణ్' హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ కాన్ఫిడెన్స్ కి తగ్గట్టుగా ఫ్యామిలీస్ నుంచి రెస్పాన్స్ లభిస్తే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అనిపించుకోవడం గ్యారెంటీ అఏ కామెంట్ లు వినిపిస్తున్నాయి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.