Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ రోబో శంక‌ర్ తో తార‌క్ భ‌న్సాలీతో!!

By:  Tupaki Desk   |   17 May 2021 1:30 AM GMT
చ‌ర‌ణ్ రోబో శంక‌ర్ తో తార‌క్ భ‌న్సాలీతో!!
X
పాన్ ఇండియా రేస్.. ప్ర‌భాస్ ప్రారంభించిన య‌జ్ఞ‌మిది. ఇందులోకి ఇత‌ర టాలీవుడ్ హీరోలు నెమ్మ‌దిగా చేరారు. ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ వ‌ర‌స‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ద‌ర్శ‌కుల్ని లాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్ని చేస్తూ వార్ లోకి స్నేహితులు చ‌ర‌ణ్‌.. తార‌క్.. బ‌న్నిల‌ను ఆహ్వానించాడు.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రోబో శంక‌ర్ తో భారీ పాన్ ఇండియా సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. చెన్న‌య్ లో ఆఫీస్ తీసి అందుకు సంబంధించిన ప‌నుల్ని సాగిస్తున్నారు. ఈలోగానే తార‌క్ కూడా త‌న స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ తో పోటీప‌డుతూ త‌దుప‌రి ద‌ర్శ‌కుల్ని లాక్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ప్లానింగ్ ని ప‌రిశీలించిన తార‌క్ ఎంతో తెలివిగా బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీతో క‌ళాత్మ‌క చిత్రానికి ప్లాన్ వేయ‌డం ఉత్కంఠ పెంచుతోంది. మ‌రోవైపు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ తోనూ తార‌క్ మంత‌నాలు సాగిస్తున్నారు.

అయితే త్రివిక్ర‌మ్ - కొర‌టాల‌కు తార‌క్ క‌మిట్ మెంట్లు ఇచ్చి ఉన్నారు. త్రివిక్ర‌మ్ తో సినిమాని ఇటీవ‌లే పోస్ట్ పోన్ చేసిన తార‌క్ కొర‌టాల‌తో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో అత‌డు సినిమా చేయాల్సి ఉంది. ఇక తార‌క్ - త్రివిక్ర‌మ్ `అయినను పోయి రావలె హస్తినకు` స్క్రిప్ట్ తోనే ముందుకు వెళ‌తారా? లేక ఇంకేదైనా స‌రికొత్త పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్క్రిప్టును ప్లాన్ చేస్తారా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్ గా మారింది. డార్లింగ్ ప్ర‌భాస్.. రామ్ చ‌ర‌ణ్ ల‌కు ధీటుగా తార‌క్ ప్లానింగ్ సాగుతోంది.

మ‌రోవైపు ఈ ముగ్గురు హీరోల‌తో పోటీప‌డుతూ బ‌న్ని- మ‌హేష్ సైతం కాంపిటీష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో రేస్ ని కొన‌సాగిస్తున్నారు.