Begin typing your search above and press return to search.

'ఉప్పెన' రికార్డును 'జాతిరత్నాలు' బ్రేక్ చేస్తుందా..?

By:  Tupaki Desk   |   9 March 2021 4:48 PM GMT
ఉప్పెన రికార్డును జాతిరత్నాలు బ్రేక్ చేస్తుందా..?
X
తెలుగు సినిమాలకు యుఎస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. మన సినిమాలు అక్కడ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబడుతుంటాయి. అయితే ఇదంతా కరోనా మహమ్మారి రాకముందు మాట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కోవిడ్ కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ బాగా దెబ్బ తినింది. యుఎస్ లో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీలో చూడటాన్ని జనాలు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన సినిమా ఒకటి రెండు లక్షల డాలర్స్ వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా పాండమిక్ తర్వాత విడుదలైన సినిమాలలో 'ఉప్పెన' సినిమా యుఎస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిందని చెప్పాలి. ఈ సినిమా సుమారు 2 లక్షల డాలర్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి కరోనా తర్వాత అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. అయితే ఇప్పుడు 'జాతిరత్నాలు' చిత్రానికి అదే స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''జాతిరత్నాలు''. స్వప్న సినిమాస్‌ బ్యానర్ పై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ వెరైటీగా ప్లాన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ యూఎస్ ఆడియన్స్ ని కూడా థియేటర్లకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ ఎంటర్టైనర్ ఇప్పటికే స్ట్రాటజిక్ ప్రమోషన్స్ తో అక్కడి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. అలానే 'మహానటి' డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. 'ఏజెంట్..' సినిమాతో అలరించిన నవీన్ కూడా ఉండటం ఈ సినిమాకి ప్లస్ అవుతున్నాయి.

కామెడీ కనుక వర్కౌట్ అయితే యూఎస్ లో ఈజీగా 2 లక్షల డాలర్స్ మార్క్ ని దాటే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. యూఎస్ లో 100కి పైగా లొకేషన్స్ లో మార్చి 10న 'జాతిరత్నాలు' ప్రీమియర్స్ పడనున్నాయి. 2021లో అక్కడ ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'ఉప్పెన' వసూళ్ళని ఈ హాస్య రత్నాలు బీట్ చేస్తారో లేదో చూడాలి.