Begin typing your search above and press return to search.

మళ్లీ బెల్లంకొండతో మాస్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   22 Nov 2017 1:29 PM IST
మళ్లీ బెల్లంకొండతో మాస్ డైరెక్టర్
X
మెగాస్టార్ చిరంజీవిని ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీలాంఛ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు మాస్ దర్శకుడు వివి వినాయక్. మాస్ పల్స్ పట్టుకోవడంలో వినాయక్ ను మించినోళ్లు లేరని టాలీవుడ్ జనాలు కూడా నమ్ముతారు. కానీ మెగా 150 తర్వాత పెద్ద సినిమాలను అందుకోలేకపోయాడు వినాయక్.

ఎన్టీఆర్.. మహేష్.. చరణ్ వంటి యంగ్ స్టార్ హీరోలను ఒప్పించలేకపోవడంతో.. మెగా హీరో సాయి ధరం తేజ్ తో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫినిషింగ్ దశకు చేరుకోగా.. త్వరలోనే కొత్త ప్రాజెక్టును వినాయక్ ప్రకటించనున్నాడట. ఇది కూడా యంగ్ హీరోతోనే కావడం గమనించాలి. అల్లుడు శీను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ను గ్రాండ్ గానే ఇంట్రడ్యూస్ చేశాడు వినాయక్. ఇప్పుడు మరోసారి ఈ కుర్రాడితో సినిమా చేయనున్నాడట. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

తన కుమారుడి కోసం బెల్లంకొండ సురేష్.. బుజ్జి ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడనే టాక్ ఉంది. మరోవైపు.. వినాయక్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు కంటే ముందే మహేష్ 3 సినిమాలు ఫినిష్ చేయాల్సి ఉంది. ఈలోగా బెల్లంకొండతో సినిమా పూర్తి చేసేస్తాడు వినాయక్.