Begin typing your search above and press return to search.

నిర్ణ‌యం మార్చుకున్న విశాల్‌.. సినిమా రిలీజ్ అక్క‌డేన‌ట‌!

By:  Tupaki Desk   |   26 Jan 2021 9:30 AM GMT
నిర్ణ‌యం మార్చుకున్న విశాల్‌.. సినిమా రిలీజ్ అక్క‌డేన‌ట‌!
X
త‌మిళ్ స్టార్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘చక్ర’. ఈ చిత్రం షూటింగ్‌ ఎపుడో ముగిసింది. కానీ.. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రాన్ని విడుదల కాలేదు. మన దగ్గర ఇప్పుడిప్పుడే స్టోర్ రూమ్ నుంచి బయటకు వస్తున్నట్టుగానే.. తమిళ్ లో కూడా ఇప్పుడిప్పుడే రిలీజ్ కు క్యూ కడుతున్నాయి.

అయితే.. హీరో సూర్య మూవీ సురారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) ఓటీటీలో రిలీజై సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఇతర సినిమాలు కూడా ఓటీటీవైపు చూడడం మొదలు పెట్టాయి. ఈ జాబితాలో హీరో విశాల్ కూడా ఉన్నాడు.

ఆయ‌న తాజా చిత్రం ‘చక్ర’ను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈ విషయంపై పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కూడా జ‌రిపారు. అయితే.. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ‘మాస్టర్‌’, ‘ఈశ్వరన్‌’ వంటి చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి.

అన్‌లాక్‌ నిబంధనలు అమ‌లవుతున్న సమయంలోనూ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. డివైడ్ టాక్ వ‌చ్చినా, 50 శాతం ఆక్యుపెన్సీ అమ‌ల్లో ఉన్నా.. విజ‌య్ ‘మాస్టర్’ మంచి క‌లెక్షన్లు రాబ‌ట్టింది. దీంతో.. తమ చిత్రాలను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భావించిన అనేక మంది నిర్మాతలు వెనక్కి త‌గ్గుతున్నారు. ఇప్పుడు హీరో విశాల్‌ కూడా వెన‌క్కి త‌గ్గారు.

తాను కూడా థియేట‌ర్లోనే సంద‌డి చేయాల‌ని డిసైడ్ అయ్యాడు విశాల్‌. ఈ మేర‌కు తన ‘చక్ర’ చిత్రాన్ని వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా నటించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చగా, ఎంఎస్‌ ఆనందన్‌ కథను సమకూర్చి దర్శకత్వం వహించారు.