Begin typing your search above and press return to search.

భక్తుడు లేడని.. అమ్మవార్లే దిగొచ్చారు

By:  Tupaki Desk   |   8 Feb 2017 7:24 PM IST
భక్తుడు లేడని.. అమ్మవార్లే దిగొచ్చారు
X
మరో రెండు రోజుల్లో అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది ఈ భక్తిరస చిత్రం. నాగార్జున- కె రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన భక్తిచిత్రాల ట్రాక్ రికార్డ్ ప్రకారం.. ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. ప్రస్తుతం నాగ్ ఇటలీలో ఉండడంతో పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు.

దీంతో ఈ చిత్రంలో శ్రీనివాసుడి భార్యలు అయిన శ్రీదేవి.. భూదేవిలుగా నటించిన విమలారామన్.. అష్మితలు రంగంలోకి దిగారు. సాధారణంగా ఈ భామలు గ్లామర్ పాత్రల్లోనే కనిపిస్తారు కానీ.. ఈ చిత్రంలో వేంకటేశుడిగా నటించిన సౌరభ్ రాజ్ జైన్ కు భార్యలుగా.. అమ్మవారి పాత్రలు పోషించారు విమలా రామన్.. అష్మిత. అందుకే ఓం నమో వేంకటేశాయ చిత్రం కోసం ప్రమోషన్స్ చేస్తున్నా.. కాసింత పద్ధతైన డ్రస్సుల్లోనే కనిపిస్తున్నారు.

అన్నమయ్య మూవీలో ఇలాగే.. కొండ మెట్లు ఎక్కలేకపోతున్న అన్నమయ్యకు ఆకలి తీర్చేందుకు అమ్మవారిగా నటించన భానుప్రియ దిగి వస్తుంది. ఇప్పుడు సినిమా కోసం ఇద్దరేసి అమ్మవార్లు దిగిరావడం విశేషమే కదా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/