Begin typing your search above and press return to search.
మనోళ్లు వాళ్లని చూసి నేర్చుకోవాలా?
By: Tupaki Desk | 25 March 2023 8:00 AM GMTసినిమా పబ్లిసిటీ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో స్ర్టాటజీతో ముందుకెళ్తుంటారు. కొందరు దర్శ-హీరోలు సినిమా పూర్తయ్యే వరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వరు. కేవలం లాంచింగ్ రోజున వచ్చే అప్ డేట్ తప్ప! తర్వాత మధ్యలో పెద్దగా అప్ డేట్స్ ఇవ్వరు. చిత్రీకరణ క్లైమాక్స్ చేరుకునే సమయం నుంచి ప్రచారం పనులు షురు చేస్తుంటారు. షూటింగ్ దశలో మాత్రం అంతా గోప్యంగా ఉంచుతారు. అసలు ఇన్ సైడ్ ఏం జరుగుతుందో? అన్న ఓ సస్పెన్స్ మెయింటెన్ చేస్తుంటారు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలన్నింటి విషయంలోనూ ఇదే జరుగుతుంది.
`ఎన్టీఆర్ 30`- `ఎస్ ఎస్ ఎంబీ 28`వ సినిమాలు ప్రారంభోత్సవానికి ముందు ఆ ఇద్దరు హీరోలు ఎలాంటి సీక్రెట్స్ మెయింటెన్ చేసారో తెలిసిందే. ఇదిగో ప్రారంభం అవుతుంది..అదిగో ప్రారంభం అవుతుందని సోషల్ మీడియాలో రగడ తప్ప అసలేంజరుగుతోంది? అన్నది వాళ్లకి తప్ప బయట ఎక్కడా తెలియదు. ఆ కారణంగా ఇద్దరు హీరోలపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కోట్లాది మంది అభిమానులు ఎంతో నిరుత్సాహనికి గురయ్యారు. అభిమానుల్ని ఇలా నిరుత్సాహ పరచడం భావ్యం కాదన్నది వాస్తవం.
ఒక్క అప్ డేట్ ఇస్తే! కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందా? అని అభిమానులే మండిపడ్డారు. మరి అప్ డేట్స్ ఇచ్చి సాధించేది? ఏంటి అంటే అందుకు ఓ స్టార్ హీరోని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అవును ఇలా ఎప్పటికప్పడు అప్ డేట్స్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కథానాయకుడగా లోకేష్ కననగరాజ్ దర్శకత్వంలో `లియో` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కశ్మిర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చెన్నైలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
`లియో` ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటివరకూ ప్రతీ అప్ డేట్ ఎప్పటికప్పుడు యూనిట్ ఇచ్చుకుంటూ వచ్చింది. మధ్య మధ్యలో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానుల అంచనాల అంచనాల్ని రెట్టింపు చేసాయి. ఇది సినిమాకి ఓ పాజిటివ్ సైన్ గా యూనిట్ భావిస్తుంది. లియో ప్రోమో నుంచి కశ్మీర్ షెడ్యూల్ వరకూ అప్ డేట్స్ సహా అంతర్గతంగా ఏం జరుగుతోందని అభిమానులు గెస్ చేస్తున్నారు. తద్వారా సినిమాపై ఎలాంటి నిరుత్సాహం లేకుండా ఉన్నారని ఓ పాజిటివ్ సంకేతాన్ని పాస్ చేసినట్లు అయింది.
ఇక్కడ అదిపురుష్ ని లింక్ చేసి మాట్లాడితే? `ఆదిపురుష్` టీజర్..ట్రైలర్ విషయంలో అభిమానుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచి చిత్రీకరణ పూర్తయ్యే వరకూ `ఆదిపురుష్` టీమ్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ముగింపుకున్న చేరుకన్న తర్వాత ప్రచారం పనులు మొదలు పెట్టింది. ఇక్కడ ఆదిపురుష్ కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభాస్ లుక్ సహా టీజర్ రీలీజ్ అనంతరం ఆద్యంతం నెగిటివ్ టాక్ వినిపించింది.
దీంతో అప్పటికప్పడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఇది నిర్మాతకు అదనపు భారం. ఇదే అప్ డేట్ సెట్స్ లో ఉన్నప్పుడే ఇచ్చి ఉంటే? అప్పుడే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. అవసరమైతే అక్కడిక్కడ రీషూట్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. సర్వం సిద్దమైన తర్వాత ఔట్ ఫుట్ పై సందేహమొస్తే కథ మొదటికే వస్తుందని `ఆదిపురుష్` స్థితిని చూస్తే అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మేకర్స్ కొందరు పక్క పరిశ్రమ ను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
`ఎన్టీఆర్ 30`- `ఎస్ ఎస్ ఎంబీ 28`వ సినిమాలు ప్రారంభోత్సవానికి ముందు ఆ ఇద్దరు హీరోలు ఎలాంటి సీక్రెట్స్ మెయింటెన్ చేసారో తెలిసిందే. ఇదిగో ప్రారంభం అవుతుంది..అదిగో ప్రారంభం అవుతుందని సోషల్ మీడియాలో రగడ తప్ప అసలేంజరుగుతోంది? అన్నది వాళ్లకి తప్ప బయట ఎక్కడా తెలియదు. ఆ కారణంగా ఇద్దరు హీరోలపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కోట్లాది మంది అభిమానులు ఎంతో నిరుత్సాహనికి గురయ్యారు. అభిమానుల్ని ఇలా నిరుత్సాహ పరచడం భావ్యం కాదన్నది వాస్తవం.
ఒక్క అప్ డేట్ ఇస్తే! కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందా? అని అభిమానులే మండిపడ్డారు. మరి అప్ డేట్స్ ఇచ్చి సాధించేది? ఏంటి అంటే అందుకు ఓ స్టార్ హీరోని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అవును ఇలా ఎప్పటికప్పడు అప్ డేట్స్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కథానాయకుడగా లోకేష్ కననగరాజ్ దర్శకత్వంలో `లియో` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కశ్మిర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో చెన్నైలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
`లియో` ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటివరకూ ప్రతీ అప్ డేట్ ఎప్పటికప్పుడు యూనిట్ ఇచ్చుకుంటూ వచ్చింది. మధ్య మధ్యలో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అభిమానుల అంచనాల అంచనాల్ని రెట్టింపు చేసాయి. ఇది సినిమాకి ఓ పాజిటివ్ సైన్ గా యూనిట్ భావిస్తుంది. లియో ప్రోమో నుంచి కశ్మీర్ షెడ్యూల్ వరకూ అప్ డేట్స్ సహా అంతర్గతంగా ఏం జరుగుతోందని అభిమానులు గెస్ చేస్తున్నారు. తద్వారా సినిమాపై ఎలాంటి నిరుత్సాహం లేకుండా ఉన్నారని ఓ పాజిటివ్ సంకేతాన్ని పాస్ చేసినట్లు అయింది.
ఇక్కడ అదిపురుష్ ని లింక్ చేసి మాట్లాడితే? `ఆదిపురుష్` టీజర్..ట్రైలర్ విషయంలో అభిమానుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచి చిత్రీకరణ పూర్తయ్యే వరకూ `ఆదిపురుష్` టీమ్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ముగింపుకున్న చేరుకన్న తర్వాత ప్రచారం పనులు మొదలు పెట్టింది. ఇక్కడ ఆదిపురుష్ కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభాస్ లుక్ సహా టీజర్ రీలీజ్ అనంతరం ఆద్యంతం నెగిటివ్ టాక్ వినిపించింది.
దీంతో అప్పటికప్పడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఇది నిర్మాతకు అదనపు భారం. ఇదే అప్ డేట్ సెట్స్ లో ఉన్నప్పుడే ఇచ్చి ఉంటే? అప్పుడే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. అవసరమైతే అక్కడిక్కడ రీషూట్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. సర్వం సిద్దమైన తర్వాత ఔట్ ఫుట్ పై సందేహమొస్తే కథ మొదటికే వస్తుందని `ఆదిపురుష్` స్థితిని చూస్తే అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మేకర్స్ కొందరు పక్క పరిశ్రమ ను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.