Begin typing your search above and press return to search.

'అర్జున్ రెడ్డి' బ్యాచ్ మళ్ళీ కలుస్తున్నారా...?

By:  Tupaki Desk   |   8 Oct 2020 12:15 PM GMT
అర్జున్ రెడ్డి బ్యాచ్ మళ్ళీ కలుస్తున్నారా...?
X
టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ - డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే క్రేజీ హీరోగా మార్చేయగా సందీప్ వంగా ని స్టార్ డైరెక్టర్స్ సరసన నిలబెట్టింది. ఇదే సినిమాని తర్వాత బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి సందీప్ వంగా అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు సందీప్. ఇక మరోవైపు విజయ్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ - సందీప్ వంగా కాంబోలో మరో మూవీ రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఇప్పుడు మరోసారి 'అర్జున్ రెడ్డి' కాంబో సెట్ అయ్యే ప‌రిస్థితులు వ‌చ్చాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. విజయ్ - సందీప్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కలవనున్నారట. నిజానికి సందీప్ హిందీలో ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ఇప్పుడు హోమ్ బ్యానర్ లో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ లో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ క్రాంతి మాధ‌వ్ చేరుతున్నాడట. విజయ్ తో 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి ప్లాప్ సినిమా తీసిన క్రాంతి మాధ‌వ్.. సందీప్ రెడ్డి వంగా డైరెక్ష‌న్ చేయ‌బోయే సినిమాకి కో ప్రొడ్యూస‌ర్ గా వ్యవహరించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈసారైనా ఈ క్రేజీ కాంబో నిజమవుతుందా లేదా ఎప్పటిలాగే రూమర్ గా మిగిలిపోతుందా అనేది చూడాలి.