Begin typing your search above and press return to search.

ఒక్క రోజులో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   20 Nov 2016 11:30 AM GMT
ఒక్క రోజులో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు
X
విఐ ఆనంద్.. రెండు రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న పేరు. ఈ ఏడాది బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలిచిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు దర్శకుడు ఇతనే. ఆల్రెడీ తెలుగులో ‘టైగర్’ అనే సినిమా తీశాడు కానీ.. అది జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. పరువు హత్యల నేపథ్యంలో సాగే కథ కావడం ఒక్కటే అందులో కొత్త పాయింట్. మిగతా అంతా మామూలు మాస్ మసాలా సినిమాల్లాగే ఉంటుంది. పైగా ‘బాహుబలి’ రావడానికి ముందు రాంగ్ టైమింగ్ లో రావడం వల్ల కూడా ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో ఆనంద్ ను జనాలు లైట్ తీసుకున్నారు. దీనికి తోడు ‘టైగర్’ సినిమాను సందీప్ కిషన్ మావయ్య అయిన సీనియర్ ఫొటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు కొంత వరకు డైరెక్షన్ కూడా చేశాడంటూ ఓ రూమర్ కూడా పుట్టింది.

ఈ నేపథ్యంలో తర్వాతి సినిమాతో ఆనంద్ తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆనంద్ ప్రతిభ మీద ఉన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేసి.. ఓవర్ నైట్ అతణ్ని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మార్చేసింది. ఆల్రెడీ అల్లు శిరీష్ తో ఓ సినిమాను ప్రకటించిన ఆనంద్.. తాజాగా ‘స్వామి రారా’ ప్రొడ్యూసర్ చక్రి చిగురుపాటి ప్రొడక్షన్లో ఓ సినిమా కమిటయ్యాడు. కొందరు స్టార్ హీరోలు కూడా ఇప్పుడు అతడితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ‘టైగర్’ కంటే ముందు ఆనంద్.. తమిళంలో ‘అప్పూచి గ్రామం’ అనే చిన్న సినిమా ఒకటి తీశాడు. అది సైన్స్ ఫిక్షన్ మూవీ. సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా.. వైవిధ్యమైన.. మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలపై మంచి పట్టున్న ఈ దర్శకుడు.. మున్ముందు ఆ తరహా సినిమాలే ఎక్కువగా చేయాలనుకుంటున్నాడు. శిరీష్ హీరోగా చేయబోయేది ఆ జానర్ మూవీనే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/