Begin typing your search above and press return to search.

ప్రభాస్ పై పొగడ్తలు గుప్పించిన సీనియర్ యాక్ట్రెస్

By:  Tupaki Desk   |   23 July 2020 10:30 AM GMT
ప్రభాస్ పై పొగడ్తలు గుప్పించిన సీనియర్ యాక్ట్రెస్
X
సీనియర్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ.. అంటే అందరికి సుపరిచితమే 1989లో విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ 'మైనే ప్యార్ కియా'తో భాగ్యశ్రీ సినీరంగ ప్రవేశం చేసింది. అదే మూవీ తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో విడుదలైన సూపర్ హిట్ అందుకుంది. తన ఫస్ట్ సినిమాతోనే ఒక్కసారిగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది భాగ్యశ్రీ. ఆ మరుసటి ఏడాది పెళ్లి చేసుకొని సినిమాలు తక్కువ చేసింది. అడపాదడపా సినిమాలలో మెరుస్తున్న భాగ్యశ్రీ మళ్లీ పాన్ ఇండియా మూవీతో హల్చల్ చేయనుంది. ఈమె ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ 'రాధేశ్యామ్'లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగులో పునఃప్రవేశం చేయనుంది. ఇదివరకే 1997లో రాజశేఖర్ హీరోగా నటించిన 'ఓంకారం' మూవీతో పరిచయం అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత తెలుగు తెరపై మెరవనుంది.

అయితే ఇటీవలే తాజాగా హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకుంది. "నేను మొదటగా బాహుబలి మూవీ చూసినప్పుడే హీరో ప్రభాస్ పై ఓ అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కానీ అతనితో మాట్లాడాకే తెలిసింది. ప్రభాస్ ఎంత నిరాడంబరమైన మనిషి అని. అతని మర్యాద, కలుపుగోలుతనం చూసి ఆశ్చర్యపోయాను. ప్రభాస్ అందరితో మాట్లాడతాడు. అతనో టీమ్ ప్లేయర్" అంటూ పొగడ్తలతో ముంచెత్తింది భాగ్యశ్రీ. ఇదిలా ఉండగా నిజానికి భాగ్యశ్రీ అడవిశేష్ హీరోగా నటించిన '2స్టేట్స్' మూవీతో తెలుగు రీఎంట్రీ ఇవ్వాలి. కానీ ఎందుకో ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు మాత్రమే కాకుండా వివిధ బాషల సినిమాల్లో నటిస్తోంది. ఇక ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. "ఈ కాలంలో సినీ ప్రేక్షకులు అన్నీ విషయాల పై అవగాహన పెంచుకున్నారు. అన్నీ రకాల కంటెంట్లను ఆదరిస్తున్నారు. ఈ మార్పులు చాలా మంచివి. ఎందుకంటే కొత్త రచయితలకు, కొత్త విషయాలు చెప్పడానికి అవకాశం లభిస్తుంది" అంటూ సెలవిచ్చింది.