Begin typing your search above and press return to search.

వెంకీ సినిమా.. అంతా అబద్ధం

By:  Tupaki Desk   |   24 Dec 2016 5:30 AM GMT
వెంకీ సినిమా.. అంతా అబద్ధం
X
ముందు డీమానిటైజేషన్ ప్రభావంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆగిందన్నారు. ఆ తర్వాత ఏకంగా సినిమానే ఆగిపోయిందన్నారు. మొత్తానికి విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ విషయంలో గత వారం రోజుల్లో రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి. పైగా వెంకీ సహా ఆ సినిమా యూనిట్ సభ్యులెవరూ స్పందించకపోవడంతో ఈ ప్రచారం నిజమే అనుకున్నారంతా. వెంకీకి ఎంతగానో నచ్చి ఒప్పుకున్న సినిమా ఇలా అయ్యిందేంటా అని అభిమానులు ఫీలైపోయారు. ఐతే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్న వార్తలు శుద్ధ అబద్ధం అంటూ నిర్మాత లైన్లోకి వచ్చాడు.

‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా వంద శాతం ఉందని చెప్పాడు దీని నిర్మాత - మల్టీ డైమన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్మోహన్ రావు. ‘‘మా సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా పక్కాగా ఉంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. చాలా బాగా వచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతాం. ఇంతలోనే ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో మాకు తెలియడం లేదు’’ అని రామ్మోహన్ రావు క్లారిటీ ఇచ్చారు. నిత్యా మీనన్ కథానాయికగా నటించే ఈ సినిమా జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు సమాచారం. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వెంకీ స్టయిల్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/