Begin typing your search above and press return to search.

సాహో తరువాత వక్కంతం వంశీకి ఛాన్స్!

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:20 AM GMT
సాహో తరువాత వక్కంతం వంశీకి ఛాన్స్!
X
బాహుబలి సిరీస్ తో అయిదేళ్లు పాటు లాక్ అయిపోయిన ప్రభాస్ ఆ సినిమాలు కారణంగా నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో ఈ అయిదేళ్లలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడనే అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ ను ఊరడించేందుకు ఇటీవలే సాహోను స్టార్ట్ చేసిన ప్రభాస్ త్వరలోనే షూట్ లో పాల్గొనబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో సాహో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ సినిమా రైట్స్ కి భారీ రేట్లు పలుకుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టోటల్ రైట్స్ కోసం బాలీవుడ్ కి చెందని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రభాస్ కి 400 కోట్లు ఆఫర్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే ఈ డీల్ ని హోల్డ్ లో పెట్టిన ప్రభాస్ తన మార్కెట్ ని బాలీవుడ్ లో ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి సాహో ప్రాజెక్ట్ లోకి శ్రద్ధా కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అంతేకాదు మళయాలంలో కూడా ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి మోహన్ లాల్ తో ఓ కీలక పాత్ర చేయిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఇన్ని పనులు చేస్తూనే సాహో తరువాత కూడా వెంటనే మరో సినిమా మొదలయ్యేలా సన్నాహలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కిక్ - టెంపర్ వంటి హిట్ సినిమాలకి కథలు అందించి తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య సినిమాతో డైరెక్టర్ గా ప్రమోటైన వక్కంతం వంశీ డైరెక్షన్ లో ప్రభాస్ నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లుగా సమాచారం. సాహో షూట్ కంప్లీటైన వెంటనే వక్కంతం వంశీ - ప్రభాస్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందని అంటున్నారు, స్టూడియో గ్రీన్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కబోతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న ప్రభాస్ రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి!